Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం
కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్ల రాబోయే రిక్రూట్మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్లను ప్రభుత్వం నిషేదించింది. అంతేకాకుండా పరీక్ష హాల్ లోపల ఫోన్లు,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి లేదు . అయితే, రైట్వింగ్ సంస్థల నిరసనల నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే పూసల నెక్లెస్లు)కాలి మెట్టెలను పరీక్షా సంఘం అనుమతించింది. పరీక్షా అధికారం నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్ను స్పష్టంగా పేర్కొననప్పటికీ, రిక్రూట్మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్లకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలు వల్ల అవి కూడా నిషేదించబడతాయి. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.