NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం 
    తదుపరి వార్తా కథనం
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం 
    అధికార మార్పుకే జై కొట్టిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం

    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం 

    వ్రాసిన వారు Stalin
    May 13, 2023
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటక ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. గత 38ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించారు.

    అధికార మార్పుకు జై కొడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. 1985 నుంచి కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు.

    అయితే ఈసారి గత 38ఏళ్ల చరిత్రను తిరగరాయాలని అధికార బీజేపీ భావించినా, అది సాధ్యం కాలేదు.

    ఈ సారి హంగుకు కూడా ఎలాంటి ఆస్కారం లేకుండా 130కి పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు స్పష్టమైన మెజార్టీని ఇచ్చారు.

    కర్ణాటక

    చివరగా రామకృష్ణ హెగ్డే రెండోసారి సీఎం అయ్యారు

    1983 నుంచి 1985 వరకు మైనారిటీ ప్రభుత్వంగా కొనసాగిన రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం 1985లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది.

    1984లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. మూడు నెలల తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన హెగ్డే నాయకత్వంలోని పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    కానీ, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే 'జనతా పరివార్‌' చీలిపోయింది. 1989 ఎన్నికల్లో వీరేంద్ర పాటిల్‌నేతృత్వంలో కాంగ్రెస్‌పార్టీ భారీ విజయాన్ని సాధించింది.

    11నెలల తర్వాత పాటిల్ అనారోగ్యానికి గురికావడంతో ప్రజల మద్దతు లేని ఎస్ బంగారప్పను కాంగ్రెస్ సీఎం చేసింది. ఆ తర్వాత నుంచి ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు.

    కర్ణాటక

    2018 ఎన్నికల్లో 104 సీట్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ 

    2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుంది. ఒక స్వతంత్ర సభ్యుడు కూడా గెలిచాడు. బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పార్టీ నుంచి ఒకరు చొప్పున విజయం సాధించారు.

    2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.04 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36.22 శాతం, జేడీ(ఎస్) 18.36 శాతం ఓట్లు సాధించాయి.

    ఆ సమయంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మరియు కాంగ్రెస్, జెడి(ఎస్) పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కుమారస్వామి సిఎం అయ్యారు.

    ఆపరేషన్ లోటస్ వల్ల 14నెలల్లో కాంగ్రెస్, జెడి(ఎస్) ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

    కర్ణాటక

    2023 ఎన్నికల్లో 130పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం

    అసెంబ్లీ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ పార్టీ కన్నడ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. దాదాపు 136స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొంది.

    గత ఎన్నికల కంటే దాదాపు 60పైగా స్థానాలను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు 65సీట్లకు పరిమితం అయ్యింది.

    ఈ సారి జేడీఎస్ కేవలం 19సీట్లకే పరిమితం అయ్యింది. గత ఎన్నికల కంటే దాదాపు 26సీట్లను జేడీఎస్ కోల్పోయింది.

    మొత్తం మీద కర్ణాటక ఓటర్ల తమ సంప్రదాయాన్ని కొనసాగించి, మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు
    బీజేపీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    కర్ణాటక

    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి బీజేపీ
    అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు బెంగళూరు
    నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికలు

    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కాంగ్రెస్
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కర్ణాటక

    తాజా వార్తలు

    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా? తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా కర్ణాటక
    National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  టెక్నాలజీ

    బీజేపీ

    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ ది వాల్ స్ట్రీట్ జర్నల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025