NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..
    తదుపరి వార్తా కథనం
    Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..
    దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..

    Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    09:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

    యూరప్‌కు చెందిన ప్రముఖ వైమానిక సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ లిమిటెడ్ (TASL) కలిసి సంయుక్తంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో హెచ్‌125 మోడల్ తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

    ప్రారంభ దశలో 10 హెలికాప్టర్లను నిర్మించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

    ఆ తరువాత వచ్చే 20 సంవత్సరాలలో ఈ గణాంకాన్ని 500 యూనిట్లకు విస్తరించాలనే ప్రణాళిక ఉంది.

    ఈ తయారీ కేంద్రాన్ని కోలార్ జిల్లాలోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ తయారీ ప్రక్రియలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించనున్నారు.

    వివరాలు 

    హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా గుర్తింపు

    ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే హెచ్‌125 హెలికాప్టర్లు దేశీయ అవసరాలు, భారత సాయుధ దళాల అవసరాల కోసం ఉపయోగించబడతాయి.

    అలాగే విదేశీ మార్కెట్‌కి కూడా ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్‌ల తర్వాత భారత్‌ హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా గుర్తింపు పొందనుంది.

    తయారీ, నిర్వహణ, మరమ్మతులు, ఒప్పంద కార్యక్రమాల (MRO - మెంటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) కోసం మొత్తం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించనున్నారు.

    ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి కావడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటుచేసిందని భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో.. కర్ణాటక
    SpaceX Starship: ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ… స్టార్‌షిప్‌ రాకెట్‌ మళ్లీ పేలిపోయింది ఎలాన్ మస్క్
    Trump: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆలా జరిగితే కెనడాకు 'గోల్డెన్ డోమ్' ఉచితం డొనాల్డ్ ట్రంప్
    BMW: విద్యుత్‌ సెడాన్‌ బీఎండబ్ల్యూ ఐ7ను ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ ఇండియా.. ధర ఎంతంటే..?  బీఎండబ్ల్యూ కారు

    కర్ణాటక

    Karnataka: బెంగళూరులో 8 నెలల బాలికలో HMPV వైరస్ ఇన్ఫెక్షన్.. ఇది దేశంలోనే మొదటి కేసు భారతదేశం
    HMPV: గుజరాత్‌లో రెండు సంవత్సరాల బాలుడికి హెచ్ఎంపీవీ.. ధ్రువీకరించిన డాక్టర్లు గుజరాత్
    HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన సిద్ధరామయ్య
    Bidar: బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం.. ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025