NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..
    తదుపరి వార్తా కథనం
    International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..
    మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..

    International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.

    ఈ మారథాన్‌లో 59 మంది విదేశీయులు, బాలీవుడ్ ప్రముఖులతో సహా రెండు వేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు.ఇది లోయ చరిత్రలో తొలి అంతర్జాతీయ స్థాయి మారథాన్.

    42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో రూ. 3 కోట్ల విలువైన బహుమతులు అందించబడ్డాయి.

    ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సునీల్ శెట్టి కలిసి మారథాన్‌ను ప్రారంభించారు.

    వివరాలు 

    13 ఇతర దేశాల నుండి రన్నర్లు

    టూరిజం శాఖ డైరెక్టర్ కశ్మీర్ రాజా యాకూబ్ మాట్లాడుతూ,"లోయలో పరిస్థితి మారిందని ప్రపంచానికి చాటిచెప్పడమే మారథాన్ ఉద్దేశం"అన్నారు."అది కాశ్మీర్, ఇక్కడ ప్రజలు పగటిపూట కూడా తమ ఇళ్లలో దాక్కోరు. అంతేకాదు ఇప్పుడు ప్రజలు పర్యాటక ప్రదేశాలు, రోడ్లు, పార్కులలో అర్థరాత్రి వరకు తిరుగుతూనే ఉంటారు "అని అన్నారు.

    "మేము ప్రపంచం నలుమూలల నుండి అత్యుత్తమ క్రీడాకారులను ఆహ్వానించాము. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు జర్మనీ, ఇంగ్లాండ్, స్వీడన్, ఆఫ్రికా వంటి 13 ఇతర దేశాల నుండి రన్నర్లు వచ్చారు.

    రిజిస్ట్రేషన్‌లో స్థానికులు కూడా పాల్గొంటున్నారు. ఈ మారథాన్ ద్వారా కాశ్మీర్ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను కూడా తెలియచేయాలని మేము భావిస్తున్నాము. సునీల్ శెట్టి సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శ్రీనగర్ చేరుకున్నారు"అని పేర్కొన్నారు.

    వివరాలు 

    42 మంది ఏస్ రన్నర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సునీత

    ఈ మారథాన్‌ లో 42 మంది ఏస్ రన్నర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సునీత మాట్లాడుతూ, "ఈ గ్రూప్ లో అనేక మంది ఆసియా గోల్డ్ మెడల్ విన్నెర్స్ ఉన్నారు. ఇంకా హాఫ్, ఫుల్ మారథాన్ పోడియం ఫినిషర్లు గోపి డి, మాన్ సింగ్, అంకిత్ దేస్వాల్, నవప్రీత్, పూనమ్, ప్రజాత్గా గాడ్‌బోలే, తొమ్మిది సార్లు టాటా మారథాన్ ముంబై విజేతలు ఉన్నారు. జ్యోతి కార్తీక్, నేషనల్ ఛాంపియన్ అశ్వని కూడా పాల్గొంటున్నారు." "భూమ్మీద స్వర్గంగా పిలుచుకునే లోయలోని రోడ్లపై పరుగెత్తే అవకాశం నాకు దక్కింది. ఈ లోయలో తొలిసారిగా ఇలాంటి మారథాన్‌లో భాగమైన ఘనతనూ పొందాను" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    జమ్ముకశ్మీర్

    Village Defence Guards: రాజౌరిలో అనుమానాస్పద కదలికలు.. కాల్పులు జరిపిన గ్రామ రక్షణ గర్డ్స్ ఇండియా
    Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-కుప్వారాలో మూడు చోట్ల ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం  భారతదేశం
    Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు భారతదేశం
    JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా  అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025