NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం
    మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం

    మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మొక్కజొన్న రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

    యాసంగిలో తెలంగాణలో 6.50లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. మొత్తం 17.37లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

    వాస్తవానికి సీజన్ మొదట్లో మొక్కజొన్నలకు ధర బాగానే ఉంది. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర(రూ.1962) కంటే రూ.400 నుంచి రూ.500 తక్కువ ధర పలుకుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    తెలంగాణ

    మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

    యాసంగిలో పండించిన మొక్కజొన్న క్వింటాల్ ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సీఎం కేసీఆర్, మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.

    కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖను సీఎం ఆదేశించారు. దిగుబడి అంచనాను బట్టి మొక్కజొన్నలో కొనుగోలు కోసం బ్యాంకు గ్యారంటీ కోసం రూ.600కోట్ల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి మార్క్ ఫెడ్ పంపింది.

    అయితే ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలిపిన వెంటనే కొనుగోలు కేంద్రాలను మార్క్ ఫెడ్ ప్రారంభించనుంది. కేసీఆర్ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తాజా వార్తలు

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    తెలంగాణ

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  హైదరాబాద్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? తెలంగాణ
    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా వార్తలు

    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  ఎయిర్ ఇండియా
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  బెంగళూరు
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025