Arvind Kejriwal: ఈడీ విచారణకి ముందు ధ్యాన శిబిరానికి అరవింద్ కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సమన్లు అందుకున్న దిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నుంచి 10 రోజుల పాటు విపస్సనా ధ్యాన సెషన్కు వెళ్లాలని యోచిస్తున్నట్లు పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా తెలిపారు.
డిసెంబరు 21న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ను దర్యాప్తు సంస్థ కోరింది.కేజ్రీవాల్కు సమన్లు రావడంపై చద్దా స్పందిస్తూ,ఢిల్లీ ముఖ్యమంత్రి విపాసన ధ్యాన శిబిరం ముందుగానే షెడ్యూల్ చేసినట్లు,న్యాయవాదుల నుండి న్యాయ సలహా తీసుకుంటున్నామని చెప్పారు.
తదనుగుణంగా ఈడీకి సమాధానం ఇస్తామని ఆయన తెలిపారు. కేజ్రీవాల్కు బీజేపీ భయపడుతోందని,ఆయనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ నేత ఆరోపించారు.
ఈరోజు సత్యేందర్ జైన్,మనీష్ సిసోడియా,సంజయ్ సింగ్ బీజేపీలో చేరితే డప్పు కొట్టి స్వాగతం పలికి కేసులు ఎత్తివేస్తారని అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియా తో మాట్లాడుతున్న రాఘవ్ చద్దా
If BJP is scared of any leader, it is @ArvindKejriwal. I'm sure he haunts them in their dreams. He will decide his future course of action after consultation with legal counsel, after his pre-decided, pre-announced Vipassana.
— AAP (@AamAadmiParty) December 19, 2023
About MPs' suspension, it was a black day in India's… pic.twitter.com/NenvfF1f6W