Dussehra holidays: ఏపీలో దసరా సెలవుల్లో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దసరా సెలవులను మార్పులను చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట ఈనెల 22వ తేదీన అధికార సెలవు దినంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తాజాగా 23, 24వ తేదీ అంటే సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఏపీలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో అక్టోబర్ 14 నుంచి దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకూ ఈ సెలవులు కొనసాగనున్నాయి. స్కూల్స్ తిరిగి ఈనెల 25వ తేదీన తేరుచుకోనున్నాయి.