NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 17, 2024
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) -2020 అమలు కోసం కసరత్తు ప్రారంభించింది.

    ఈ విధానంలోని కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావాలని నిర్ణయించుకుంది. ప్రధానంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ విద్యావిధానాన్ని రద్దు చేయాలని చూస్తోంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వేర్వేరు సంస్థల పరిధిలో ఉన్నా, కొత్త విధానం అమల్లోకి వస్తే 'బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్'ను తొలగించి, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురానున్నారు.

    ఈ మార్పుల వల్ల పర్యవేక్షణ సులభం అవుతుందని, సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

    Details

    ఎన్ఈపీ అమలుపై చర్చ

    మరోవైపు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

    ఎన్ఈపీ - 2020 అమలుతో పొందే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

    ఇటీవల ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎన్ఈపీ అమలుపై చర్చ జరిగింది.

    బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లో అమలవుతుండగా, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదు.

    కేంద్రం, ఎన్ఈపీ అమలుపై ఒత్తిడి తీసుకురావడంతో, ఈ అంశంపై రాష్ట్రం దృష్టిసారించింది.

    Details

    ఒకటో తరగతిలో చేరేందుకు ఆరేళ్లు వయస్సు ఉండాలి

    ప్రస్తుత విద్యావిధానంలో రాష్ట్రం 5+2+3+2 విధానం (ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్)ను అనుసరిస్తోంది. కానీ, కేంద్రం సూచిస్తున్న కొత్త విధానం 5+3+3+4గా ఉండి, ఇందులో ఇంటర్మీడియెట్ విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ కింద చేర్చనుంది.

    ఒకటో తరగతిలో చేరేందుకు వయస్సు ఆరేళ్లు నిండాలని కేంద్రం నిర్ణయించింది.

    ఇదే సమయంలో ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన చేయాలన్న ప్రతిపాదనకు సర్కారు సానుకూలంగా ఉంది.

    హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇప్పటికే ఎన్ఈపీ అమలు ప్రక్రియ మొదలైంది.

    నాలుగేళ్ల డిగ్రీ, బకెట్ సిస్టమ్, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానాలను జేఎన్టీయూ వంటి సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    తెలంగాణ

    Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు ములుగు
    Telangana: రాష్ట్రంలో AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
    Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో భారతదేశం
    Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్‌  భారతదేశం

    ప్రభుత్వం

    ఎన్నికల వేళ తెలంగాణలో కీలక నిర్ణయం..మరోసారి ఆసరా పెన్షన్ల పెంపు దిశగా సర్కార్ తెలంగాణ
    DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్   తెలంగాణ
    Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ
    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025