NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు
    రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు

    AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 07, 2025
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా రాయితీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

    రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 35శాతంగా ఉన్న పెట్టుబడి రాయితీని 45శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

    ఇప్పటివరకు ఉత్పత్తి రంగానికి మాత్రమే ఈ రాయితీ ఉండగా, ఇకపై రవాణా, లాజిస్టిక్స్‌ రంగాలకు కూడా 45శాతం లేదా గరిష్ఠంగా రూ.75 లక్షల రాయితీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది.

    ఈ రాయితీలు కొత్త పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి.

    Details

    భూమి విలువ రాయితీ పెంపు 

    ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇంతకుముందు భూమి విలువపై 50% రాయితీ (గరిష్ఠంగా రూ.2 లక్షలు) ఇస్తుండగా, దీన్ని 75% (గరిష్ఠంగా రూ.25 లక్షలు) పెంచే ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది.

    విద్యుత్తు రాయితీ

    ఎంఎస్‌ఎంఈడీపీ-4.0 పాలసీలో మహిళలు, బీసీలు, విభిన్న ప్రతిభావంతులకు ఆరేళ్లపాటు విద్యుత్తు రాయితీగా ప్రతి యూనిట్‌కు రూ.1, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తోంది.

    అన్నివర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఐదేళ్లపాటు విద్యుత్తు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.

    రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ను ఐదేళ్లపాటు కొనసాగించనున్నట్లు మంత్రిమండలి స్పష్టం చేసింది.

    Details

    నీరు-చెట్టు పెండింగ్ బిల్లులకు పరిష్కారం 

    2014-19లో టీడీపీ హయాంలో నీరు-చెట్టు పథకంలో చేసిన పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

    జగన్ ప్రభుత్వం ఈ పనులపై విజిలెన్స్ కేసులు పెట్టి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నిరోధించినట్లు అధికారులు తెలిపారు.

    ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా 61 మంది కాంట్రాక్టర్లు మృతి చెందారని పేర్కొన్నారు. ఆగిపోయిన రూ.50.56 కోట్ల బిల్లులను చెల్లించనున్నారు.

    డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్

    రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగంలో రద్దీ తగ్గించేందుకు డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నారు.

    Details

     4.28 లక్షల ఉద్యోగ అవకాశాలు 

    ప్రస్తుతం 34 ప్రాజెక్టులకు రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటివల్ల 4,28,705 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది.

    పాలసీ మార్పులు

    2024-29 కాలానికి రూపొందించిన ఎంఎస్‌ఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్, సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్‌టైల్స్, అపెరల్, గార్మెంట్స్ పాలసీలకు సవరణలు మంత్రిమండలి ఆమోదించింది.

    ఎలీప్ ప్రాజెక్ట్ భూకేటాయింపు

    తూర్పుగోదావరిలో 34.19 ఎకరాల భూమిని తమ్మినపట్నం ప్రాంతం కోడూరుకు మార్చారు. రూ.305 కోట్ల పెట్టుబడులు, 6,000 మందికి ఉపాధి లభించనుంది.

    Details

     రైతులకు ఎక్స్‌గ్రేషియా 

    చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లో ఆక్రమణలో ఉన్న రైతులకు ఎకరానికి రూ.8 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు.

    టీటీడీలో 15 పోటు వర్కర్స్ పోస్టులను సూపర్‌వైజర్లుగా, సీనియర్ అసిస్టెంట్ కేడర్‌కు సమానంగా పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

    సౌర విద్యుత్తుకు భారీ ప్రోత్సాహం

    3,200 మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల రూ.5,500 కోట్ల పెట్టుబడులు, 3,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

    Details

    కేటాయించిన ప్రాజెక్టులివే

    టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్: అనంతపురం గంగవరంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్తు

    సయేల్ సోలార్ ఎంహెచ్‌పీ2 ప్రైవేట్ లిమిటెడ్: అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో 300 మెగావాట్లు

    ఎకోరెన్ ఎనర్జీ ఇండియా: అనంతపురం, కడప, ఆస్సారీ ప్రాంతాల్లో రిన్యూవబుల్ ప్రాజెక్టుల కోసం అభ్యర్థన

    నవయుగ ఇంజినీరింగ్: అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలి (1500 మెగావాట్లు), చిట్టంవలస (800 మెగావాట్లు)

    Details

    కొమ్మూరు పీఎస్‌పీ ప్రాజెక్ట్ 

    అన్నమయ్య జిల్లా చింతలకుంట సమీపంలో 2,000 మెగావాట్ల కొమ్మూరు పీఎస్‌పీ ప్రాజెక్ట్‌ కోసం మేఘా ఇంజినీరింగ్ ప్రతిపాదన మంజూరైంది.

    ఈ మంత్రిమండలి సమావేశంలో ఆర్థిక, పరిశ్రమల, రైతుల, విద్యుత్తు రంగాల్లో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

    పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా పాలసీలు సవరించడంతో పాటు, రైతులకు ఎక్స్‌గ్రేషియా, పరిశ్రమలకు రాయితీలు పెంపు, నీరు-చెట్టు బిల్లుల చెల్లింపు వంటి అంశాల్లో ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం.. పాకిస్థాన్
    Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం నరేంద్ర మోదీ
    Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం హైదరాబాద్
    Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి ప్రేరణ

    ఆంధ్రప్రదేశ్

    KRMB: ఏపీ-తెలంగాణ మధ్య పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు : కృష్ణా బోర్డు తెలంగాణ
    AP News: బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు వరుసల హైవే.. ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం భారతదేశం
    Andhra Pradesh: జాతీయ రహదారుల విస్తరణ.. రూ. 5,417 కోట్లతో పనులు భారతదేశం
    Andhra news: నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు.. రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు  పర్యాటకం

    చంద్రబాబు నాయుడు

    CBN Collectors Meeting: రేషన్, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు భారతదేశం
    Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు  భారతదేశం
    CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన ఆంధ్రప్రదేశ్
    Chandrababu: చంద్రబాబు పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష  పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025