NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం
    పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం

    Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

    ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించగా, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో, రాష్ట్ర క్యాబినెట్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.

    మరోవైపు, ఇటీవల నిర్వహించిన 47వ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూములను కేటాయించే అంశానికి కూడా ఆమోదముద్ర వేసింది.

    వివరాలు 

    త్రివిధ దళాలకు క్యాబినెట్ అభినందనలు

    'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ' వంటి సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

    అంతేగాక, తీర ప్రాంత భద్రతపై,రక్షణ రంగ పరిశ్రమల చుట్టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.

    ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు క్యాబినెట్ అభినందనలు తెలిపింది.

    అంతేకాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 'అమరావతి' పేరును జోడించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది.

    ఏపీ రాజధాని పేరుగా అమరావతిని పేర్కొనాలన్న నిర్ణయాన్ని మంజూరు చేసింది.

    వివరాలు 

    పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులు..  వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదన 

    రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి మెగా ఈవెంట్లను నిర్వహించాలన్న యోజనకు మంత్రివర్గం మద్దతు తెలిపింది.

    మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే 281 పనులను హైబ్రిడ్ యాన్యూటీ పద్ధతిలో అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.

    అంతేగాక, కేంద్ర ప్రభుత్వ వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం ఆంధ్రప్రదేశ్
    Indian railway: అధిక ధర గురించి ఫిర్యాదు.. ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడి(వీడియో) రైల్వే శాఖ మంత్రి
    India-Pakistan Conflict: కరాచీ,లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు.. పాకిస్తాన్ ఆర్మీ ఆరోపణ.. పాకిస్థాన్
    Ajit Krishnan: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు.. గగన్‌యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌నువెనక్కి పిలిపించిన వాయుసేన గగన్‌యాన్ మిషన్‌

    ఆంధ్రప్రదేశ్

    Raj Kasireddy: ఏపీ సిట్‌ పోలీసులు అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి భారతదేశం
    APPSC: పెండింగ్‌లో ఉన్న 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం భారతదేశం
    PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ భారతదేశం
    Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025