NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..
    తదుపరి వార్తా కథనం
    Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..
    కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..

    Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది.

    రైల్వే లైన్ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణం చేపట్టేలా సంబంధిత చర్యలు ప్రారంభించారు.

    ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశించడంతో పనులు మళ్లీ పట్టాలు ఎక్కాయి.

    గతంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో రైల్వే అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు.

    ఆ భూముల్లో రైల్వే నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు.

    వివరాలు 

    రైల్వే అధికారులను ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్.. 

    అయినవిల్లి మండలంలోని శానపల్లి లంక, సిరిపల్లి, మాగం, అలాగే అమలాపురం రూరల్ మండలంలోని ఏ. వేమవరం, బట్నవిల్లి గ్రామాల్లో రైల్వే లైన్‌కు అవసరమైన భూసేకరణ పూర్తయింది.

    రైల్వే అధికారులు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపి నిర్మాణ పనులను ప్రారంభించారు.

    రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో భూసేకరణ పూర్తయిన భూములను సర్వే చేసి, హద్దులను గుర్తించి, రైల్వే అధికారులకు అప్పగిస్తున్నారు.

    సంబంధిత ప్రాంతాల్లో రైతులు తదుపరి పంట వేయకముందే, భూసేకరణ పూర్తయిన భూములను రైల్వే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పనులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    ఆంధ్రప్రదేశ్

    Fake IPS: నకిలీ ఐపీఎస్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి! పవన్ కళ్యాణ్
    Vijayanand: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా విజయానంద్‌ భారతదేశం
    Andhra Pradesh: గోదావరి - బనకచర్ల అనుసంధానం.. 3 నెలల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం భారతదేశం
    Vijaya Ghee: ఆలయాల్లో 'విజయ' నెయ్యి తప్పనిసరి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025