NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం
    తదుపరి వార్తా కథనం
    Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం
    12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం

    Prayagraj: 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా.. వక్ఫ్ భూమిపై కొనసాగుతున్న వివాదం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత ఘనంగా జరగనుంది.

    ఈ సాంప్రదాయ ఆధ్యాత్మిక వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

    యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వందలాది అఖాడాలు ఇప్పటికే అక్కడకు చేరుకుని తమ పీఠాలను ఏర్పాటు చేశాయి.

    రైల్వే శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. ఈ మహోత్సవానికి 50 రోజులపాటు 13 వేల రైళ్లు నడవనున్నాయి.

    12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళా ప్రారంభానికి ముందే కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

    Details

     ప్రయోగరాజ్ కేంద్రంగా 14 కేంద్రాలు

    కుంభమేళా జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని ప్రయాగ్‌రాజ్‌లోని ముస్లిములు పేర్కొన్నారు.

    ముస్లిముల వాదన ప్రకారం, ఈ భూమి 54 బిఘాల (దాదాపు 34 ఎకరాలు) పరిధిలో ఉంది. ఈ భూమి ముస్లిములదేనని, హిందువుల ఉత్సవాలకు అనుమతించడం తమ విశాల హృదయానికి నిదర్శనమని అఖిల భారత ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ చెప్పారు.

    హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే వైఖరిని ప్రదర్శించాలని ఆయన కోరారు.

    ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న కుంభమేళా కోసం ప్రాంతాన్ని మొత్తం 25 విభాగాలుగా విభజించారు. వాటిలో 14 ప్రయాగ్‌రాజ్‌ కేంద్రంగా, మిగిలిన 9 ఝున్సీ వద్ద ఏర్పాటుచేశారు.

    Details

    భక్తుల కోసం 13వేల ప్రత్యేక రైళ్లు

    భారీ భద్రత కోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేటు రికగ్నిషన్ టెక్నాలజీ, యాంటీ-డ్రోన్ వ్యవస్థ, అండర్‌వాటర్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

    కుంభమేళాకు యాత్రికులను తరలించేందుకు రైల్వే శాఖ 13 వేల రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో 10 వేల రెగ్యులర్ రైళ్లు, 3 వేల ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.

    ముఖ్యంగా ఉత్సవం ప్రారంభానికి ముందు 2-3 రోజులు, ముగిసిన తర్వాత 2-3 రోజులు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

    ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయాన్ని కలిగి ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

    వక్ఫ్ భూమి వివాదం నేపథ్యంలో పునాది స్థాయిలో చర్చలు కొనసాగుతుండగా, ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ఇండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఉత్తర్‌ప్రదేశ్

    Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి  భారతదేశం
    Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్‌ పై ఎల్‌పిజి సిలిండర్‌.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం భారతదేశం
    UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం భారతదేశం
    Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం ఇండియా

    ఇండియా

    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు జమ్ముకశ్మీర్
    Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు! ఆంధ్రప్రదేశ్
    Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు  తమిళనాడు
    Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు! ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025