NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 
    తదుపరి వార్తా కథనం
    Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 
    'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం

    Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ ఆరోపించారు.

    ఈ ఆరోపణలపై మంగళవారం బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. ఘటనను అతిగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలను ఖండించారు.

    ''అఖిలేశ్‌ యాదవ్‌కు అసత్యాలు చెప్పడం అలవాటు. మేము కూడా కుంభమేళాకు వెళ్లాం. లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నా, యూపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోంది'' అని ఆమె అన్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళాలో, మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

    వివరాలు 

    మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారి గణాంకాలను కూడా ప్రజలకు తెలియజేయాలి: అఖిలేశ్

    ఈ ఘటనపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ, ''ప్రభుత్వం ఎప్పుడూ బడ్జెట్ గణాంకాలను ప్రకటిస్తుంది. అదే విధంగా, మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారి గణాంకాలను కూడా ప్రజలకు తెలియజేయాలి. అక్కడి ఏర్పాట్లను సమీక్షించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. కుంభమేళా నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలి. మృతుల సంఖ్య, గాయపడిన వారికి అందించిన వైద్యం, మందులు, ఆహారం, రవాణా వంటి అన్ని వివరాలను పార్లమెంటులో సమర్పించాలి. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిజాలను దాచిన వారిని శిక్షించాలని డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజం చెప్పకుండా గణాంకాలను ఎందుకు దాచారు?'' అని ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Kanpur: కాన్పూర్‌లో కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన..  భారతదేశం
    KumbhMela 2025: మహా కుంభమేళా 2025లో ఫైర్ సేఫ్టీ కోసం రోబోలు..! భారతదేశం
    Sambhal violence: సంభాల్ హింసలో సమాజ్‌వాదీ ఎంపీ పాత్ర.. స్థానిక గుంపుని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశాడని ఎఫ్ఐఆర్.. భారతదేశం
    5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025