Page Loader
Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 
'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం

Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంగళవారం బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. ఘటనను అతిగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలను ఖండించారు. ''అఖిలేశ్‌ యాదవ్‌కు అసత్యాలు చెప్పడం అలవాటు. మేము కూడా కుంభమేళాకు వెళ్లాం. లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నా, యూపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోంది'' అని ఆమె అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళాలో, మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు.

వివరాలు 

మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారి గణాంకాలను కూడా ప్రజలకు తెలియజేయాలి: అఖిలేశ్

ఈ ఘటనపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ, ''ప్రభుత్వం ఎప్పుడూ బడ్జెట్ గణాంకాలను ప్రకటిస్తుంది. అదే విధంగా, మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారి గణాంకాలను కూడా ప్రజలకు తెలియజేయాలి. అక్కడి ఏర్పాట్లను సమీక్షించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. కుంభమేళా నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలి. మృతుల సంఖ్య, గాయపడిన వారికి అందించిన వైద్యం, మందులు, ఆహారం, రవాణా వంటి అన్ని వివరాలను పార్లమెంటులో సమర్పించాలి. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిజాలను దాచిన వారిని శిక్షించాలని డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజం చెప్పకుండా గణాంకాలను ఎందుకు దాచారు?'' అని ప్రశ్నించారు.