Page Loader
Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్

Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 

వ్రాసిన వారు Stalin
Aug 01, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది. తాజాగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ కోటాకింద ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించినట్లు ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కుర్రా సత్యనారాయణ 1999లో సంగారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలం క్రితం ఆయన బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుధీర్ఘ కాలం టీఆర్ఎస్‌లో పని చేసిన దాసోజు శ్రావణ్, 2015లో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఆయన తిరిగి బీఆర్ఎస్‌లోకి వచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నామినేట్ ఎమ్మెల్సీలను ప్రకటించిన కేటీఆర్