NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anam Ramanarayana Reddy: లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Anam Ramanarayana Reddy: లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
    లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

    Anam Ramanarayana Reddy: లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 24, 2024
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.

    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి నియామకంపైనా కూడా చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు.

    ఇక కొత్త పాలకమండలి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    Details

    బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు 

    టీటీడీ బోర్డు నియామకం త్వరలో జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు.

    నూతన పాలకమండలిని త్వరలోనే నియమించి, దేవాలయాల నిర్వహణలో సరైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

    లడ్డూ వివాదానికి సంబంధించిన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

    చంద్రబాబు నాయుడు దీనిపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, సాయంత్రంలోగా జీవో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.

    ఈ సమస్య కారణంగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో, ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమాలు నిర్వహించామని మంత్రి వివరించారు.

    బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆనం రామనారాయణ రెడ్డి
    టీటీడీ

    తాజా

    Donald Trump: ఆపిల్ సహా విదేశీ ఫోన్లపై ట్రంప్ భారీ సుంకాల ప్రకటన అమెరికా
    Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన నైరుతి రుతుపవనాలు
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్
    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్

    ఆనం రామనారాయణ రెడ్డి

    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025