
Kolkata: విద్యార్థినిపై అఘాయిత్యం.. స్పందించిన లా కాలేజీ వైస్ ప్రిన్సిపల్!
ఈ వార్తాకథనం ఏంటి
కోల్కతాలోని న్యాయ కళాశాలలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 24 ఏళ్ల న్యాయ విద్యార్థినిపై పూర్వ విద్యార్థి, ఇద్దరు సీనియర్ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోనే దారుణానికి ఒడిగట్టిన ఘటనపై తాజాగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ నయన ఛటర్జీ స్పందించారు. ఈ ఘోర ఘటనపై తమ దృష్టికి మీడియా ద్వారా వివరాలు వచ్చాయని, అప్పటిదాకా తాము ఎలాంటి సమాచారం పొందలేదని వెల్లడించారు. బాధితురాలు జూన్ 25న పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజు, పోలీసులు కళాశాలకు వచ్చారని చెప్పారు. అయితే ఈ విషయంపై సెక్యూరిటీ సిబ్బందికి కూడా వెల్లడించవద్దని వారు సూచించారని నయన ఛటర్జీ తెలిపారు.
Details
రెండు గదులు సీజ్
పోలీసులు విచారణ కోసం గ్రౌండ్ ఫ్లోర్లోని రెండు గదులను సీజ్ చేశారని వివరించారు. బాధితురాలైతే కళాశాల యాజమాన్యానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా తమ పూర్వ విద్యార్థి అని, ఇటీవల బోధనా సిబ్బంది కొరత కారణంగా అతడిని తాత్కాలిక అధ్యాపకుడిగా నియమించామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై కళాశాల యాజమాన్యం అప్రతిభ చూపుతోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడింది.
Details
కేసుపై దర్యాప్తు మరింత వేగవంతం
ఇలాంటి ఘోరమైన ఘటనను తాము ఆలస్యంగా తెలుసుకోవడమైతే విద్యార్థుల రక్షణపై ఉన్న బాధ్యతల్ని ప్రశ్నించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డు మోనోజిత్కు సహకరించాడనే అనుమానంతో అతనిని కూడా విచారిస్తున్నారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. బాధితురాలికి న్యాయం కల్పించడంతో పాటు, నిందితులకు కఠిన శిక్షలు విధించాలంటూ కోరుతున్నారు.