అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ
ఈ వార్తాకథనం ఏంటి
2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారం హౌరాలో కలిశారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రితో జరిగిన భేటీలో నితీష్ కుమార్తో పాటు బిహార్ డిప్యూటీ తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం జరిగింది.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు.
అందరం కలిసి ముందుకు సాగుతామని, తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని, సమిష్టిగా కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీని జీరోకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మమత స్పష్టం చేశారు.
మమత
బిహార్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి: మమత
తాను నితీష్ కుమార్కి ఒకే ఒక అభ్యర్థన చేసానని, జయప్రకాష్ జీ ఉద్యమం బిహార్ నుంచే ప్రారంభమైందని, ఒకవేళ అందరం బిహార్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే, తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని మమత పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నితీశ్ కుమార్ మండిపడ్డారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావడం, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు చేయడం గురించి తాము మమతో చర్చించినట్లు చెప్పారు.
దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు పాలిస్తున్న వారు చేసిందేమీ లేదన్నారు. వారు కేవలం తమ సొంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
ఈ సమావేశంలో టీఎంసీ, బిహార్ మహాఘటబంధన్ తదుపరి లోక్సభ ఎన్నికల కోసం బ్లూప్రింట్ను కలిసి సిద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి.