NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Groundwater: పడిపోతున్న భూగర్భ జల మట్టాలు.. పెరిగిన ఎండలు.. భారీగా నీటి వినియోగం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Groundwater: పడిపోతున్న భూగర్భ జల మట్టాలు.. పెరిగిన ఎండలు.. భారీగా నీటి వినియోగం
    పడిపోతున్న భూగర్భ జల మట్టాలు.. పెరిగిన ఎండలు.. భారీగా నీటి వినియోగం

    Groundwater: పడిపోతున్న భూగర్భ జల మట్టాలు.. పెరిగిన ఎండలు.. భారీగా నీటి వినియోగం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 21, 2025
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నీటి వినియోగం అదే స్థాయిలో కొనసాగుతోంది.

    వాగులు,చెరువులు,కుంటలు మెల్లమెల్లగా బూడిదలా మారుతున్నాయి. ముఖ్యమైన జలాశయాల్లో నిల్వలు వేగంగా ఆవిరైపోతున్నాయి.

    ఈ పరిస్థితులు భూగర్భ జలాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.ఈ తరుణంలో చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా భూగర్భ జలాలను మరింతగా ఉపసంహరించేందుకు యత్నిస్తున్నారు.

    భూగర్భ జల వనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం,ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 9.91 మీటర్ల వద్ద నమోదైంది.

    ఇది గత ఏడాది మార్చి నెలలో 9.69 మీటర్లుగా ఉండేది. అనంతరం ఆగస్టు చివర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది.

    వివరాలు 

    ఆ ఐదు జిల్లాల్లో తోడేస్తున్నారు

    అయితే అక్టోబర్ నుండి వర్షపాతం తగ్గిపోవడంతో భూగర్భ జల మట్టం మళ్లీ క్రమంగా పడిపోతూ వస్తోంది.

    ప్రస్తుతం ఏప్రిల్‌లో కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నా, అవి భూగర్భ జలాలను అధికంగా భర్తీ చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

    రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోయింది.వాటిలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ నీటి తోడకం జరిగింది.

    ఫిబ్రవరిలోతో పోల్చితే మార్చిలో అక్కడ భూగర్భ జల మట్టం ఏకంగా 6.24 మీటర్ల మేర తగ్గిపోయింది.

    సిద్దిపేటలో 2.62 మీటర్లు,సంగారెడ్డిలో 2.34 మీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరిలో 2.15 మీటర్లు, యాదాద్రి భువనగిరిలో 2.11 మీటర్ల లోతుకు పడిపోయినట్లు నమోదు అయ్యింది.

    వివరాలు 

    ఆ ఐదు జిల్లాల్లో తోడేస్తున్నారు

    అంతేకాదు, మెదక్, ములుగు, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, జనగామ, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ నీటి వినియోగం అధికంగా ఉండటంతో భూగర్భ జలాల మట్టం క్రమంగా తగ్గిపోతున్నదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    Dilsukhnagar Bomb Blast:దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు .. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష హైకోర్టు
    Registrations: తెలంగాణ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానం.. ఎప్పటినుంచంటే..?  భారతదేశం
    Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్
    Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం! ఇంటర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025