NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌
    తదుపరి వార్తా కథనం
    Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌
    ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌

    Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2025
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిలను చెల్లించని ఆస్తులను సీజ్‌ చేస్తోంది. తాజాగా నగరంలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు షాక్‌ ఇచ్చింది.

    బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లో ఉన్న తాజ్‌ బంజారా హోటల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. రెండు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో హోటల్‌ గేట్లకు తాళాలు వేశారు.

    పలుమార్లు నోటీసులు పంపినా హోటల్‌ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

    హోటల్‌కు రూ.1.43 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. రెడ్‌ నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం హోటల్‌ను సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు.

    జీహెచ్‌ఎంసీకి మొత్తం రూ.9,800 కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది.

    Details

    మార్చి 29 లోపల చెల్లించాలి

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.2,200 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 23 లక్షల నిర్మాణాలుండగా, వీటిలో 12 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు.

    ఐదు లక్షల నిర్మాణాల యజమానులు ఆస్తి పన్ను చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్షా 8 వేల ఆస్తుల నుంచి రూ.320 కోట్లు వసూలు చేశారు.

    పెండింగ్‌లో ఉన్న పన్నులను మార్చి 29వ తేదీలోగా వసూలు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ఆదేశాలు జారీచేశారు.

    ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లింపుల పెండింగును తగ్గించేందుకు మరోసారి వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) విధానం అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    హైదరాబాద్

    Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం తెలంగాణ
    Hyderabad: నూతన సంవత్సర వేడుకల వేళ.. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు  భారతదేశం
    Hyderabad: హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలకు మెట్రో సేవలు పొడిగింపు ఇండియా
    Hyderabad: కొండాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం అగ్నిప్రమాదం

    తెలంగాణ

    Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ! రేవంత్ రెడ్డి
    Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే! హైదరాబాద్
    New Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు భారతదేశం
    Electricity Department: వేసవికి విద్యుత్‌ శాఖ ముందస్తు సన్నాహాలు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025