Page Loader
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం

లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం

వ్రాసిన వారు Stalin
Jul 26, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. చర్చల షెడ్యూల్ గురించి సభ్యులకు తరువాత తెలియజేస్తామని చెప్పారు. మణిపూర్ పరిస్థితిపై పార్లమెంట్‌లో చర్చించాలని, మోదీ దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో మణిపూర్ పరిస్థితిపై ఉభయ సభల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి 'ఇండియా' తరఫున కాంగ్రెస్ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే బీఆర్ఎస్ ఇండియా కూటమిలో భాగం కానందున విడిగా తన తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్