LOADING...
Rain Alert In AP: ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక
ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక

Rain Alert In AP: ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ అల్పపీడనానికి తోడుగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం పైగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Details

వర్షాల వివరాలు 

నవంబర్ 17 (సోమవారం) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రకాశం, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం. నవంబర్ 18 (మంగళవారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో **తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు** నమోదయ్యే అవకాశం.

Details

మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

వాతావరణ విశ్లేషణ ప్రకారం నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక కొత్త అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. దీని ప్రభావం వల్ల నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.