LOADING...
LPG Vessel Jag Vasant: హోర్ముజ్ సంక్షోభం మధ్య గుజరాత్‌కు చేరిన 'జగ్ వసంత్' ఎల్పీజీ నౌక
Jag Vasant: హోర్ముజ్ సంక్షోభం మధ్య గుజరాత్‌కు చేరిన 'జగ్ వసంత్' ఎల్పీజీ నౌక

LPG Vessel Jag Vasant: హోర్ముజ్ సంక్షోభం మధ్య గుజరాత్‌కు చేరిన 'జగ్ వసంత్' ఎల్పీజీ నౌక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యమైన ఇంధన మార్గం హోర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితుల మధ్య మరో ఎల్పీజీ సరకు నౌక 'జగ్ వసంత్' శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది. ఈ నౌకలో మొత్తం 42,000మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG)ఉంది. సముద్ర మధ్యలో ఈ గ్యాస్ బదిలీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. సోమవారం'జగ్ వసంత్'తో పాటు'పైన్ గ్యాస్'అనే మరో ఎల్పీజీ ట్యాంకర్ భారత్ వైపు ప్రయాణం ప్రారంభించాయి. సాధారణంగా ఉపయోగించే సూటి మార్గాన్ని కాకుండా,ఈ రెండు నౌకలు అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఈ ట్యాంకర్ల ప్రయాణాన్ని ట్రాక్ చేసినప్పుడు,అవి అరేబియా సముద్రంలోకి వెళ్లే సాధారణ మార్గం బదులుగా కేశ్మ్-లారక్ చానల్ ద్వారా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు గుర్తించారు.

వివరాలు 

ప్రయాణ సమయంలో మారిన గుర్తింపులు

భారత్ వైపు ప్రయాణం ప్రారంభించిన తర్వాత, ఒకదానికొకటి సమీపంలో ప్రయాణించిన ఈ రెండు నౌకలు తమ onboard మెసేజింగ్‌ను కూడా మార్చాయి. ముందుగా "IND SHIP AND CREW", "ALL INDIA CREW" వంటి సాధారణ గుర్తింపులు ఉపయోగించిన ఈ నౌకలు, తర్వాత "PINE GAS INDIAN SHIP", "JGVASNTINDSHIPINDCRW" వంటి స్పష్టమైన గుర్తింపులను ప్రదర్శించాయి. ఇది లారక్ చానల్ ద్వారా ప్రయాణించే సమయంలో తీసుకున్న జాగ్రత్త చర్యగా భావిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా, ఈ ట్యాంకర్లు ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందినట్టు,అలాగే తమ గుర్తింపును స్పష్టంగా తెలియజేసి దాడుల ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

వివరాలు 

ఇప్పటికే చేరుకున్న ఇతర ఎల్పీజీ నౌకలు

పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ముందుగా నిర్వహించిన మీడియా సమావేశంలో, 'జగ్ వసంత్' హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి, మార్చి 26న భారత్‌కు చేరుకుంటుందని తెలిపారు. 'జగ్ వసంత్' భారత్‌కు చేరుకున్న మూడవ ఎల్పీజీ ట్యాంకర్‌గా నిలిచింది. దీని కంటే ముందు 'నందా దేవి', 'శివాలిక్' అనే రెండు నౌకలు కూడా గుజరాత్ పోర్టులకు చేరుకున్నాయి. 'శివాలిక్' మార్చి 16న ముండ్రా పోర్టుకు చేరుకోగా, 'నందా దేవి' తదుపరి రోజు వాడినార్ పోర్టులో డాక్ అయింది. ఈ రెండు నౌకలు కలిపి 92,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీని తీసుకువచ్చాయి.

Advertisement