NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం
    మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం

    PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    12:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహా ఉత్సవం విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్‌లో పంచుకున్నారు.

    ఇంత భారీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతటి సవాళ్లను ఎదుర్కొంటుందో ప్రస్తావించారు. ఏమైనా అసౌకర్యం కలిగి ఉంటే భక్తులు క్షమించాలంటూ అభ్యర్థించారు.

    ఐక్యత కోసం నిర్వహించిన ఈ మహాయజ్ఞం విజయం సాధించిందని, భారతీయ సంస్కృతి ఐక్యతకు ఈ మహా కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని మోదీ చెప్పారు.

    అంచనాలను మించిపోయేలా కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారని, నవ భారత నిర్మాణానికి ఇది సంకేతమని తెలిపారు.

    Details

    భక్తులు స్వచ్ఛదంగా రావడం అభినందనీయం

    ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరే ఇతర కార్యక్రమంతో పోల్చలేమని, త్రివేణి సంగమం తీరం వైపు కోటికి పైగా భక్తులు ఎలా చేరుకున్నారో ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు.

    అధికారికంగా ఎటువంటి ఆహ్వానాలు పంపకపోయినా, పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు భక్తులు స్వచ్ఛందంగా తరలి రావడం అభినందనీయమన్నారు.

    గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానం అనంతరం వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, సంతృప్తి తానేప్పటికీ మర్చిపోలేనన్నారు.

    చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది వ్యయప్రయాసలను మరిచి కుంభమేళాకు రావడం చూసి మక్కువ కలిగిందని మోదీ తన భావాలను వ్యక్తం చేశారు.

    Details

    ఫిబ్రవరి 5న కుంభమేళాకు విచ్చేసిన మోదీ

    ఈ సందర్భంగా మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

    తమ ప్రయత్నాల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తూ క్షమాపణ కోరుతున్నానని మోదీ అన్నారు.

    ఫిబ్రవరి 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాకు విచ్చేసి పవిత్ర నదుల్లో స్నానం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..  సోనియా గాంధీ
    People's Budget:"ప్రజల బడ్జెట్,పొదుపు,పెట్టుబడి పెరుగుతాయి".. బడ్జెట్‌పై స్పందించిన పీఎం మోదీ భారతదేశం
    Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు  డొనాల్డ్ ట్రంప్
    PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే! ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Maha Kumbh : మహా కుంభమేళా కోసం 13వేల ప్రత్యేక రైళ్లు  భారతదేశం
    Maha Kumbh Mela : కుంభ మేళాకు వెళ్తున్నారా? తెలుగు వారి కోసం  పార్కింగ్ ప్రదేశాలు, రూట్ వివరాలు!  భారతదేశం
    Maha Kumbh Mela: మహా కుంభమేళా పుణ్యస్నానాలతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం ఇండియా
    Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025