NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం
    ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం

    Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    09:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశానికి లక్షలాది భక్తులు తరలి వచ్చారు.

    పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు ప్రారంభించారు.

    ఈ వేడుక 45 రోజుల పాటు కొనసాగనుంది. దేశం నలుమూలల, విదేశాల నుంచి భక్తులు, పర్యటకులు ఈ కుంభమేళాను సందర్శించనున్నారు.

    యూపీ ప్రభుత్వం మొత్తం 35 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

    Details

    కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు

    భక్తుల సౌకర్యం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నదిలో భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేక తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

    భద్రతా సిబ్బంది చిన్న పడవలపై నిరంతరం పెట్రోలింగ్‌ చేస్తున్నారు.

    కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు భక్తులు ఉండగలిగేలా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.

    భద్రత నిమిత్తం 55 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసి, 45,000 మంది పోలీసులను మోహరించారు.

    ఈ కుంభమేళాలో సాధువుల 13 అఖాడాలు కూడా పాల్గొననున్నాయని అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగి ఆదిత్యనాథ్
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మహారాష్ట్ర
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ బీజేపీ
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్‌ పై ఎల్‌పిజి సిలిండర్‌.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం భారతదేశం
    UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం భారతదేశం
    Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం ఇండియా
    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025