NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి
    తదుపరి వార్తా కథనం
    TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి
    TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి

    TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 15, 2023
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో నేటి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని సర్కార్ ప్రకటించింది.

    మహాలక్ష్మీ పథకం అమలుకు సాఫ్ట్ వేర్ అప్'డేట్ చేశామన్నారు. మహిళ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

    ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.

    ప్రతి మహిళా ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్'ను తీసుకుని సంస్థకు సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

    ఈ మేరకు మహిళలకు జీరో టిక్కెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం సాయంత్రం ఎండీ సజ్జనార్ వర్చువల్'గా సమావేశమయ్యారు.

    DETAILS

    స్థానికత చూపించి జీరో టికెట్ పొందాలి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

    మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు సాఫ్ట్'వేర్ అప్'డేట్ చేశామని, ఈ మేరకు టిమ్ మిషన్'లో ఇన్'స్టాల్ చేశామన్నారు.

    వాటి ద్వారానే నేటి నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే మహిళా ప్రయాణికులు ఆధార్, ఓటర్ లాంటి గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలన్నారు.

    స్థానికత, ధృవీకరణ కోసం వాటిని బస్ కండక్టర్లకు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్స్ ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.

    డిసెంబర్ 9 మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తీసుకురావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana new DGP: తెలంగాణ కొత్త డిజీపిగా రవిగుప్తా  భారతదేశం
    Congress: నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ రెడ్డి!  కాంగ్రెస్
    Telangana Assembly: అసెంబ్లీలో తొలిసారి డబుల్ డిజిట్‌కు చేరిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య  అసెంబ్లీ ఎన్నికలు
    టీఎస్‌జెన్‌కో, టీఎస్‌ట్రాన్స్‌కో సీఎండీ పదవికి ప్రభాకర్‌రావు రాజీనామా  విద్యుత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025