NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 
    మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన

    మహబూబ్‌నగర్ సభలో మోదీ వరాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన 

    వ్రాసిన వారు Stalin
    Oct 01, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహబూబ్ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేసారు.

    తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

    తెలంగాణలో చాలా జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మోదీ పేర్కొన్నారు.

    దీని వల్ల రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులువు అవుతుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

    అలాగే సమ్మక్క, సారలమ్మ పేరుతో యూనివర్సీటీని కూడా ఏర్పాటు చేయున్నట్లు మోదీ ప్రకటించారు.

    మోదీ

    రూ.13,500 విలువైల ప్రాజెక్టులకు శంకుస్థాపన 

    ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహబూబ్ నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమలకు శ్రీకారం చుట్టారు.

    రూ.13,500 విలువైల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్త శంకుస్థాపన చేసిన వాటిలో జాతీయ రహదారులు, రైల్వేతో పాటు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

    కాచిగూడ-రాయ్‌చూర్‌ మధ్య మోదీ కొత్త రైలును ప్రారంభించారు. అలాగే హసన్‌-చర్లపల్లి హెచ్‌పీసీఎల్‌ ఎల్పీజీ పైప్‌లైన్‌‌ను జాతికి అంకితం ఇచ్చారు.

    అంతేకాకుండా హెచ్‌సీయూలో నూతన భవానాలను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రాజెక్ట్‌ పైప్‌లైన్‌ ప్రారంభించారు.

    మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ప్రాజెక్ట్‌లో కీలకమైన జక్లేర్‌-కృష్ణా రైల్వే లైన్‌‌ను ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు.

    రూ.2457 కోట్లతో సూర్యాపేట-ఖమ్మం హైవేకు మోదీ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా వరంగల్‌-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి పనులకు మోదీ శంకుప్థాపన చేశారు.

    మోదీ

    మోదీకి గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని స్వాగతం

    ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్వాగతం పలికారు.

    ఈ సారి కూడా సీఎం కేసీఆర్ మోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తెలంగాణలో మోదీ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండటం ఇది ఆరోసారి కావడం గమనార్హం

    హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికార్‌ మహబూబ్ నగర్‌కు చేరుకున్నారు.

    ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న మోదీ

    #WATCH | Mahabubnagar, Telangana: PM Modi says, "India is a prime producer, consumer and exporter of Turmeric. Farmers of Telangana produce turmeric in huge quantities. After Covid, awareness about turmeric has increased and global demand has also increased. Today it is important… pic.twitter.com/YDGEajoqYU

    — ANI (@ANI) October 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    నరేంద్ర మోదీ

    తాజా

    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ

    తెలంగాణ

    NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు  దుబాయ్
    తెలంగాణలో వచ్చే 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. సగటు వర్షపాతాన్ని దాటేసినట్లు ఐఎండీ వెల్లడి  భారీ వర్షాలు
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు  ప్రభుత్వం
    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..  జో బైడెన్
    ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ  జీ20 సదస్సు
    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  దిల్లీ
    Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం మొరాకో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025