Goa: గోవా పోలీసుల అదుపులో మహారాష్ట్ర ఎమ్మెల్యే కుమారుడు
ఈ వార్తాకథనం ఏంటి
గోవా పోలీసులు ఉత్తర గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో జరిగిన గొడవకు సంబంధించి ముంబై వ్యాపారి అబు ఫర్హాన్ అజ్మీ, ఇద్దరు గోవా వాసులపై కేసు నమోదు చేశారు.
పోలీసుల ప్రకారం, విలాసవంతమైన ఎస్యూవీని నడుపుతున్న ఫర్హాన్ అజ్మీని కొంతమంది స్థానికులు ఆపి, అతను అతివేగంగా వాహనం నడుపుతున్నాడని ఆరోపించారు.
ఫర్హాన్ అజ్మీ తండ్రి అబు అజ్మీ ముంబై మంఖుర్ద్ షివాజీనగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఫర్హాన్ తనపై ఒత్తిడి తగ్గించేందుకు పోలీసులకు ఫోన్ చేసి, స్థానికులను వెనక్కి తగ్గాలని హెచ్చరించాడు. అంతేకాక, తన దగ్గర లైసెన్స్ ఉన్న ఆయుధం ఉందని కూడా చెప్పాడు.
వివరాలు
పోలీసుల చర్య
ఈ సంఘటన గోవాలోని పర్యాటక ప్రాంతంలోని ప్రధాన రహదారిపై గందరగోళానికి కారణమైంది.
ఈ విషయాన్ని పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో,అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
"పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత,స్థానికులు డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు సహకరించలేదు.చివరకు,గొడవలో పాల్గొన్న ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించి,ఫిర్యాదు చేసే అవకాశం ఇచ్చాం.కానీ ఇరువర్గాలు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించాయి," అని ఉత్తరగోవా పోలీస్ అధికారి కౌశల్ తెలిపారు.
కేసు నమోదు
"పబ్లిక్ ప్రదేశంలో గొడవ పడి,శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది," అని ఆయన వివరించారు.
అజ్మీతో పాటు,గోవా పోలీసులు ఇద్దరు స్థానికులు జియోన్ ఫెర్నాండెస్,జోసెఫ్ ఫెర్నాండెస్లపై కూడా కేసు నమోదు చేశారు.