NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ 
    తదుపరి వార్తా కథనం
    Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ 
    పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ

    Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ 

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    07:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.

    అయితే ఈ హింసపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ బుధవారం మీడియాతో మాట్లాడారు.

    పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని మమతా బెనర్జీ తెలిపారు.

    హింసాత్మక ఘటనలపై విచారణకు బెంగాల్‌కు బీజేపీ నిజనిర్ధారణ బృందాన్ని పంపడంపై మమత మండిపడ్డారు. మణిపూర్ మండుతున్నప్పుడు నిజనిర్ధారణ బృందం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

    ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి మొత్తం 19 మంది చనిపోయారని, అందులో ఎక్కువ మంది తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారే ఉన్నారని ఆమె అన్నారు.

    బెంగాల్

    మరణించిన వారి కుటుంబంలో ఒకరికి హోంగార్డు ఉద్యోగం: మమత

    పంచాయతీ ఎన్నికల హింసలో మరణించిన 19 మందికి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి హోంగార్డు ఉద్యోగం ఇస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

    ఈ 19మందిలో 10మంది టీఎంసీకి చెందిన వారు ఉన్నారని మమతా స్పష్టం చేశారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా మరణించిన అందరి కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు.

    గ్రామీణ ఎన్నికలు జరిగిన 71,000 బూత్‌లలో కేవలం 60బూత్‌లలో మాత్రమే హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని బెంగాల్ సీఎం పేర్కొన్నారు.

    పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ప్రజలకు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం: సీఎం

    The 19 people who have died will be provided Rs 2 lakhs compensation and a special home guard job. These comprise 10 from TMC. We will not differentiate based on the party they belong to, all those who have died will be given compensation and job from the government: West Bengal… pic.twitter.com/r20RNSypQn

    — ANI (@ANI) July 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్
    పంచాయతీ ఎన్నికలు
    పోలింగ్

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్
    టీచర్స్ స్కామ్: 59 మంది ఉపాధ్యాయులను తొలగించాలని హైకోర్టు ఆదేశం భారతదేశం

    పంచాయతీ ఎన్నికలు

    West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్  పశ్చిమ బెంగాల్
    పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు పశ్చిమ బెంగాల్

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025