NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mamata Benarjee: బెంగాల్‌లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు.. బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
    తదుపరి వార్తా కథనం
    Mamata Benarjee: బెంగాల్‌లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు.. బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
    బెంగాల్‌లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు.. బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

    Mamata Benarjee: బెంగాల్‌లోకి బంగ్లాదేశ్ చొరబాటుదారులు.. బీఎస్ఎఫ్ కారణం అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అనుమతిస్తూ రాష్ట్రంలో అస్థిరత సృష్టిస్తోందని గురువారం ఆరోపించారు.

    ఈ ఆరోపణలు పెద్ద దుమారానికి దారితీశాయి. ఇది కేంద్ర ప్రభుత్వ నీచమైన బ్లూప్రింట్ అని ఆమె పేర్కొన్నారు.

    బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ చొరబాట్లను అనుమతిస్తోందని, మహిళలను హింసిస్తోందని మమత ఆరోపించారు.

    ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బంగ్లాదేశ్ నుంచి జరిగే చొరబాట్లు బెంగాల్‌లో శాంతి భంగం కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించగా, కొద్ది రోజుల తర్వాత మమతా చేసిన ఈ కామెంట్లు కొత్త చర్చలకు దారితీశాయి.

    వివరాలు 

    బీఎస్ఎఫ్ చొరబాట్లకు అనుమతిస్తోంది

    వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం టీఎంసీ-బీజేపీ మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

    ''బీఎస్ఎఫ్ చొరబాట్లకు అనుమతిస్తోంది. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. టీఎంసీ సరిహద్దులను కాపాడలేదు కదా, ఎందుకంటే సరిహద్దు మన ఆధీనంలో లేదు. అందువల్ల ఎవరైనా టీఎంసీపై అభియోగాలు చేస్తే, అది బీఎస్ఎఫ్ బాధ్యత అని నేను స్పష్టంగా చెబుతాను,'' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

    ఈ సమస్యపై డీజీపీకి దర్యాప్తు చేయాలని ఆదేశించామని, చొరబాట్లు జరిగిన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.

    ఆమె ప్రభుత్వానికి, కేంద్రానికి కూడా సంబంధిత సమాచారం ఉందని, ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.

    వివరాలు 

    బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లకు బెంగాల్ నర్సరీగా మారింది: మమతా బెనర్జీ

    బంగ్లాదేశ్‌తో శత్రుత్వం లేదని, కానీ అక్కడి గుండాలను అనుమతించి వారు ఇక్కడ నేరాలు చేసి తిరిగి సరిహద్దు దాటుతున్నారని ఆరోపించారు.

    దీని వెనుక బీఎస్ఎఫ్ పాత్ర ఉందని, కేంద్రం దీనికి సహకరిస్తోందని అన్నారు.

    భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు 4,096 కి.మీ విస్తరించి ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు జరిగే విషయం ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.

    బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లకు బెంగాల్ నర్సరీగా మారిందని, మమతా బెనర్జీ ఓట్ల కోసం ఈ పరిస్థితిని అనుమతిస్తున్నారని, బెంగాల్ బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలకు గేట్వేగా మారిందని ఆయన విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ

    తాజా

    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత
    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన బంగ్లాదేశ్
    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం అమెరికా

    మమతా బెనర్జీ

    దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి   శ్రీలంక
    న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్
    Mamata Banerjee : మహువా మోయిత్రా కేసులో మౌనం వీడిన దీదీ.. ఏమన్నారంటే  మహువా మోయిత్రా
    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  ఛత్తీస్‌గఢ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025