NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ
    తదుపరి వార్తా కథనం
    Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ
    రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి.. నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ

    Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2024
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో విముఖత చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    నేతాజీ 127వ జయంతి సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా మాట్లాడారు.

    గత 20ఏళ్లుగా నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ తన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు పేర్కొన్నారు.

    రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటించే కేంద్ర ప్రభుత్వం.. దేశం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు సెలవు ప్రకటించకపోవడం సిగ్గు చేటన్నారు.

    రామమందిర ప్రారంభోత్సవాన్ని 'రాజకీయ' కార్యక్రమం అంటూ మమతా బెనర్జీ స్పష్టంగా పేర్కొన్నారు.

    రాజకీయ ప్రచారం కోసమే జనవరి 22న సెలవు మంజూరు చేశారని కేంద్రంపై విరుచుకుపడ్డారు.

    మోదీ

    కేంద్ర ప్రభుత్వ విధానాలపై మమతా ధ్వజం

    కేంద్ర ప్రభుత్వ విధానాలను సైతం మమతా బెనర్జీ టార్గెట్ చేశారు. నేతాజీ ప్రణాళికా సంఘాన్ని సృష్టించారని, అయితే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిందన్నారు.

    ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చారని, ఈరోజు దేశానికి ప్లానింగ్‌ కమిషన్‌ ఎందుకు లేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

    నీతి ఆయోగ్‌ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కానీ నేడు దానికి ఎలాంటి విధానం లేదని మమతా బెనర్జీ అన్నారు.

    దేశానికి స్వాతంత్ర్యం రాకముందే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారని మమతా బెనర్జీ అన్నారు.

    నేతాజీ అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించడంలో చొరవ చూపడం లేదని మోదీ ప్రభుత్వం ధ్వజమెత్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్

    పశ్చిమ బెంగాల్

    10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు రాజ్యసభ
    West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు  ఎన్నికలు
    పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి  పోలింగ్
    రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్ భారతదేశం

    తాజా వార్తలు

    BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'  బీజేపీ
    Hanuman: కలెక్షన్స్‌లో అదరగొడుతున్న 'హనుమాన్'.. అమెరికాలో రికార్డులు బద్దలు  హను-మాన్
    Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్  తెలంగాణ
    జనవరి 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025