NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
    తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

    Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ప్రసిద్ధ అన్నామలై ఆలయంలో మాంసాహారంతో కూడిన ఆహారం తీసుకొచ్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

    ఆలయంలో నాల్గవ ప్రహారం (అంటే వెలుపల భాగం) వద్ద ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్టు భక్తులు గమనించారు.

    వెంటనే వారు ఆలయ అధికారులకు సమాచారం అందించారు.

    తక్షణమే అక్కడికి వచ్చిన అధికారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు.

    దీంతో అతడు స్పందిస్తూ.. తాను కేవలం 'కుస్కా' (ఉప్పు, మసాలా లేని బిర్యానీ) ఆర్డర్ చేసినప్పటికీ, అనుకోకుండా దానిలో చికెన్ ముక్కను కూడా పెట్టారని తెలిపాడు.

    అయితే, ఈ వివరణతో సంతృప్తి చెందని అధికారులు అతని వద్దున్న ఆహారాన్ని స్వాధీనం చేసుకుని, దాన్ని ప్యాక్ చేయించి పోలీసులకు సమాచారం అందించారు.

    వివరాలు 

    తీవ్రంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ నేతలు

    ఆ తర్వాత పోలీసులు విచారణ కోసం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

    ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

    హిందూ సమాజ భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకు ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

    ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం హిందువులను తక్కువచేసేలా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.

    వివరాలు 

     జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే 

    అయితే, జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం వద్ద ఇలాంటి కేసు ఒకటి చోటు చేసుకున్నదని గుర్తు చేశారు.

    అప్పట్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నేత,రామనాథపురం ఎంపీ నవాస్ ఖని, తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ దగ్గర మాంసాహారం తిన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు.

    అయితే, ఈ ఆరోపణలను ఎంపీ నవాస్ ఖని ఖండించారు. బీజేపీ తప్పుడు ప్రచారాల కోసం ముందుండే పార్టీ అని, ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Tamil Nadu: తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. తమిళనాడు
    Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు  ఇండోర్
    Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం! నిజామాబాద్
    IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

    తమిళనాడు

    RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్..  భారతదేశం
    MK Stalin: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. సీఎం స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు భారతదేశం
    CM Stalin: జాతీయ గీతంపై వివాదం.. సీఎం స్టాలిన్‌పై గవర్నర్‌ విమర్శలు గవర్నర్
    Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు సంక్రాంతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025