Vikarabad: రైలు ప్లాట్ఫారమ్ మధ్యలో ఇరుకున్న ప్రయాణీకుడు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 30, 2024
02:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని వికారాబాద్ స్టేషన్లో ఒక వ్యక్తి రైలు, ప్లాట్ఫారమ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఒక ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయింది. రాయచూర్కు చెందిన సతీశ్ వికారాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, అదుపు తప్పి రైలు- ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చెయ్యడంతో రైల్వే సిబ్బంది, పోలీసులు రైలును నిలిపివేశారు. అధికారులు ఆ వ్యక్తిని రక్షించి వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి