NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 
    Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

    Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Apr 13, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

    గ్రేటర్ నోయిడా పోలీస్ స్టేషన్ బీటా-2 ప్రాంతంలోని ప్యారీ చౌక్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.

    బైక్ నడుపుతున్న సురేంద్ర సింగ్(28),అతని ఇద్దరు సోదరీమణులు శైలి(26),అన్షు(14) మరణించారు.

    కాగా మరో మహిళ సిమ్మి కు తీవ్రగాయాలయ్యాయి. ఈ నలుగురు కస్నాలో ఓ వివాహ వేడుకకు వెళ్లి బైక్‌పై నోయిడాలోని కులేసరకి తిరిగి వస్తున్నారు.

    ప్రమాదం అనంతరం ,సురేందర్, అతని సోదరీమణులు శైలి, అను మృతిచెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    Details 

    కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు

    ఈ ఘటనతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండడంతో పాటు బంధువులు కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

    కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    శివ్ సింగ్ తన కుటుంబంతో కలిసి ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్‌లోని కులేసర గ్రామంలోని మధుబన్ విహార్ కాలనీలో నివసిస్తున్నాడు.

    పారిశ్రామికవాడలోని బల్బుల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం తన కుమారుడు సురేంద్ర సింగ్ తన సోదరీమణులు శైలీ, అన్షుతో కలిసి బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కస్నాకు వెళ్లారు.

    Details 

    ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బైక్ 

    వివాహం తర్వాత, రాత్రి 2.30 గంటల సమయంలో,సురేంద్ర సింగ్ తన స్ప్లెండర్ బైక్‌పై తన ఇద్దరు సోదరీమణులతో ఇంటికి వస్తుండగా,అదే సమయంలో శైలీ కూడా వారితో కలిసి వస్తా అనడంతో వారు నలుగురూ ఎలాగో బైక్‌పై ఇంటికి బయలుదేరారు .

    తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పారి చౌక్ సమీపంలో సురేంద్ర సింగ్ బైక్‌ను గుర్తు తెలియని పెద్ద వాహనం ఢీకొట్టింది.

    దీంతో అందరూ తీవ్రంగా గాయపడ్డారు. అంతే కాదు ఈ ప్రమాదంలో బైక్ చాలా దూరం ఈడ్చుకెళ్లడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది.

    Details 

    శుక్రవారం మధ్యాహ్నం సురేంద్ర సింగ్ మృతి

    ఈ ప్రమాదంలో శైలి, అన్షు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సురేంద్ర సింగ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచారు.

    చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం సురేంద్ర సింగ్ మృతి చెందాడు.

    ఈ ప్రమాదంలో శివ సింగ్ తన ముగ్గురు పిల్లలను కోల్పోయాడు. ఇప్పుడు గ్రేటర్ నోయిడాలోని కాలేజీలో చదువుతున్న అతని చిన్న కొడుకు శివం మాత్రమే మిగిలాడు.

    పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    నోయిడా
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    దిల్లీ

    Suhani Bhatnagar: 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత  బాలీవుడ్
    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్  తాజా వార్తలు
    JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు  జేపీ నడ్డా
    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్  కేంద్ర ప్రభుత్వం

    నోయిడా

    Noida: రేవ్ పార్టీని ఛేదించిన నోయిడా పోలీసులు.. 5 మంది అరెస్ట్, ఎఫ్ఐఆర్ బిగ్ బాస్ విజేత  భారతదేశం
    Diwali Accident : పండుగ పూట రోడ్డు ప్రమాదాలు.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు దీపావళి
    Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే..  ఆనంద్ మహీంద్ర
    Woman gang raped: మహిళపై సామూహిక అత్యాచారం.. బ్లాక్ మెయిల్, ముగ్గురు అరెస్ట్ భారతదేశం

    రోడ్డు ప్రమాదం

    లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి  లద్దాఖ్
    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి  తమిళనాడు
    Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బస్సు-ట్రక్కు ఢీ; 11మంది మృతి  రాజస్థాన్
    అమెరికా: జాహ్నవి మృతిపై దర్యాప్తు చేయాలని భారత్ డిమాండ్  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025