
Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్కేసులో..
ఈ వార్తాకథనం ఏంటి
రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.
తల్లి మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టుకొని, రైలులో ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లాడు.
డిసెంబర్ 13న బిహార్కు చెందిన హిమాన్షు తల్లితో కలిసి హర్యానాలో ఉంటున్నాడు. తన తల్లిని రూ.5వేలు అడిగాడు.
ఆమె నిరాకరించడంతో, వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో హిమాన్షు తన తల్లిని గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు.
అదేరోజు సాయంత్రం, అతను తన తల్లి మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టుకొని పారవేయడానికి రైలులో ప్రయాగ్రాజ్కు వెళ్లాడు.
హత్య
పోలీసులకు పట్టుబడ్డ హిమాన్షు
ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు పట్టుబడ్డాడు. అనుమానం వచ్చిన పోలీసులు సూట్కేస్ను సోదా చేయగా అందులో మహిళ మృతదేహం కనిపించింది.
విచారణలో భాగంగా పోలీసులు హర్యానాలోని హిసార్లో హిమాన్షు ఇంటి యజమానిని సంప్రదించారు.
డిసెంబర్ 13 ఉదయం హిమాన్షు తల్లిని యజమాని చివరిసారిగా చూశాడు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీని పరిశీలించగా.. అందులో హిమాన్షు ఆటోలో సూట్ కేసుతో వెళుతున్నట్లు కనిపించింది. అయితే విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.