NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి 
    గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్

    Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 20, 2025
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరు, ఒకప్పుడు సుందరంగా ఉన్న నగరంగా ప్రశంసలు పొందింది.

    కానీ ఇప్పుడు ఆ మహానగరం కుక్కలు చింపేసిన విస్తరిలా తయారయింది.

    నగరంలోని రహదారులన్నీలోతైన గుంతలు, వాటిలో నిలిచిన నీరు వాహనదారులకు తీవ్ర సమస్యలు కలిగిస్తున్నాయి.

    ఈ రహదారి పరిస్థితుల వల్ల వాహనదారులు శారీరకంగా, మానసికంగా గాయపడుతున్నారు.

    ఈ నేపథ్యంలో బెంగళూరులో నివసించే దివ్య కిరణ్ అనే వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

    రోడ్లపై ఉన్న నాణ్యతలేని పరిస్థితుల వల్ల తన ఆరోగ్యంలో తీవ్రమైన మార్పులు వచ్చాయని, శారీరిక, మానసిక బాధలు ఎదుర్కొంటున్నానని ఆయన వాపోయారు.

    వివరాలు 

     ఆరోగ్య సమస్యలకు సంబంధించి తొమ్మిది ఆసుపత్రుల మెడికల్ స్టేట్‌మెంట్‌లు 

    మౌలిక సదుపాయాల కల్పనలో నగర పాలకులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దివ్య కిరణ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కు రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు.

    ఈ నోటీసులో ఆయన తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి తొమ్మిది ఆసుపత్రుల మెడికల్ స్టేట్‌మెంట్‌లను జత చేశారు.

    రహదారిపై అసమానతల వల్ల వాహనం నడపలేని స్థితి ఏర్పడి,తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు తెలిపారు.

    మెడ, వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నానని చెప్పిన ఆయన, ఆర్థోపెడిక్ నిపుణులను ఐదు మార్లు కలిసినట్టు పేర్కొన్నారు.

    అలాగే సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి నాలుగు సార్లు అత్యవసర సేవల కోసం వెళ్లినట్టు వివరించారు.

    నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు ఇంజెక్షన్లు, ఇతర వైద్య చికిత్సలు తీసుకున్నట్టు తెలిపారు.

    వివరాలు 

    ఈ దుస్థితికి ప్రజలే కారణం: పరమేశ్వర్

    లీగల్ నోటీసులో రూ.50 లక్షల పరిహారంతో పాటు, తన లీగల్ ఖర్చుల కోసం రూ.10,000 కూడా చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు.

    దీనిపై స్పందన రాకపోతే, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా సంప్రదిస్తానని హెచ్చరించారు.

    ఇక మరోవైపు, సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమైంది.

    రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి.

    ప్రజలు సాధారణ రవాణా వదిలి పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఈ వర్షపు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దుస్థితికి ప్రజలే కారణమంటూ రాష్ట్ర మంత్రి పరమేశ్వర్ వ్యాఖ్యానించారు.

    రహదారులు నీటమునిగినట్లయితే దానికి కారణం ప్రజలే అని ఆరోపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి  బెంగళూరు
    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్
    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    బెంగళూరు

    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు  కర్ణాటక
    Ratan Tata: ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని నడిపిన రతన్‌ టాటా.. జెట్‌ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్‌  రతన్ టాటా
    Acid Attack: యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన బెంగళూరు యువకుడు ఉద్యోగం నుంచి తొల‌గింపు భారతదేశం
    Bengaluru: ఉచిత టొమాటోలను పంపినందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై మండిపడిన బెంగళూరు వ్యక్తి  స్విగ్గీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025