NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి
    మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ

    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 18, 2023
    02:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

    తోవైకుకి గ్రామంలో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల మోతలో ముగ్గురు గ్రామస్తులు చనిపోయారు.మృతులను జామ్‌ఖోగిన్ హాకిప్(26),తంగ్‌ఖోకై హాకిప్ (35),హోలెన్‌సన్ బైట్ (24)గా గుర్తించారు.

    లిటన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుకీ గ్రామంలో పొద్దున్నే భారీ ఎత్తున కాల్పుల శబ్దాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో తనిఖీలు జరిపినట్లు చెప్పారు.

    ఈ క్రమంలోనే ముగ్గురు యువకుల మృతదేహాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఆయా మృతదేహాలపై తీవ్ర కత్తి గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.తాజా ఘటనతో మణిపూర్ వాసులు మరోసారి భయాందోళ చెందుతున్నారు.

    details

    శాంతిభద్రతల కోసం 40 వేల మంది పారామిలిటరీ దళాలను మోహరించిన కేంద్రం

    మైతీ వర్గానికి షెడ్యూల్డ్ తెగ హోదాని వ్యతిరేకిస్తూ కొండ ప్రాంతాల్లో గిరిజనులు(కుకీలు) ఓ యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మే 3న యాత్ర హింసాత్మకంగా మారి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి.

    ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రం అట్టుడికిపోయింది. హింసకాండలో ఈశాన్య రాష్ట్రంలో 120 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటికే అల్లర్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు.

    మారణకాండను కట్టడి చేసి, మణిపూర్ లో శాంతిభద్రతలను సాథారణ స్థితికి తీసుకువచ్చేందుకు పోలీసులతో కలిసి కేంద్ర భద్రతా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

    ఈ మేరకు దాదాపు 40వేల మంది పారామిలిటరీ దళాలను కేంద్రం మోహరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్

    మణిపూర్

    రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు అత్యాచారం
    Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ గిరిజనులు
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025