NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ 
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ 
    భారతదేశం

    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 30, 2023 | 01:51 pm 1 నిమి చదవండి
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ 
    ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం(ఏప్రిల్ 30)న నిర్వహించిన 100వ ఎపిసోడ్‌ను న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. యూఎన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఛాంబర్‌లో కూడా మన్ కీ బాత్‌ను ప్రసారం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు, ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలలో ప్రసారమైంది. 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌లో మోదీ చేసిన ప్రసంగంలో కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

    'మన్ కీ బాత్' కారక్యక్రమం కాదు, ఆధ్యాత్మిక ప్రయాణం: మోదీ

    మన్ కీ బాత్ అనేది మిలియన్ల మంది భారతీయుల భావోద్వేగాల వ్యక్తీకరణ అన్నారు ప్రధాని మోదీ. తనకు సామాన్యులతో కనెక్ట్ అవ్వడానికి మన్ కీ బాత్ ఒక పరిష్కార మార్గాన్ని చూపిందన్నారు. ఇది కేవలం కార్యక్రమం కాదని, తనకు ఒక విశ్వాసం అని, ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. మన్ కీ బాత్‌లో లేవనెత్తిన అంశాలే ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ వ్యాఖ్యానించారు. 'స్వచ్ఛ్ భారత్' అయినా, ఖాదీ అయినా, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' అయినా మన్ కీ బాత్‌నుంచి వచ్చినవే అని స్పష్టం చేశారు. తనకు వేల ఉత్తరాలు వచ్చాయని, వాటిలో వీలైనన్ని ఎక్కువ చూడటానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రజలు రాసిన ఉత్తరాలు చదువుతున్నప్పుడు తాను ఉద్వేగానికి లోనైట్లు చెప్పారు.

    సేవా దృక్పథంతో 'మన్ కీ బాత్' నిర్వహణ: మోదీ

    మన్ కీ బాత్‌లోని ప్రతి ఎపిసోడ్‌లో భారతీయుడు ఇతర దేశస్థులకు స్ఫూర్తిగా నిలుస్తాడని మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్‌లోని ప్రతి ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేస్తుందన్నారు. హర్యానాలో ప్రారంభించిన 'సెల్ఫీ విత్ డాటర్' గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించడం నుంచి మేక్ ఇన్ ఇండియా, స్పేస్ స్టార్టప్‌ల వరకు విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైన వ్యక్తుల కథలను 'మన్ కీ బాత్' ప్రదర్శించిందన్నారు. 'మన్ కీ బాత్' ఎల్లప్పుడూ సద్భావనతో, సేవాదృక్పథంతో, కర్తవ్య భావంతో ముందుకు సాగినట్లు మోదీ పేర్కొన్నారు.

     'మన్ కీ బాత్'ను విజయవంతం చేయడంపై మోదీ కృతజ్ఞతలు 

    PM @narendramodi expresses his gratitude to the entire AIR team, MyGov, media and especially the people of India for making 'Mann Ki Baat' a resounding success. #MannKiBaat100 pic.twitter.com/loWEYOwjH7

    — PMO India (@PMOIndia) April 30, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మన్ కీ బాత్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు

    మన్ కీ బాత్

    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం ప్రధాన మంత్రి
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    ప్రధాన మంత్రి

    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్

    తాజా వార్తలు

    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  తెలంగాణ
    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ
    వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?  కడప
    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023