NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ 
    'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ

    Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్యాంగం మనకు మార్గదర్శకమైన దీపంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ . ఇది కాల పరీక్షలను తట్టుకుని నిలిచిందని పేర్కొన్నారు.

    ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని, రాజ్యాంగ అమలుకు 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈసారి గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని చెప్పారు.

    ''దేశానికి మార్గనిర్దేశం చేసే రాజ్యాంగం కారణంగానే నేను ఈ స్థాయికి ఎదిగాను. రాజ్యాంగం గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి కాన్‌స్టిట్యూషన్‌75.కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రజలు సందర్శించాలి'' అని సూచించారు.

    అలాగే, వచ్చే నెల 14 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే మహా కుంభమేళా ద్వారా దేశంలో ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.

    భిన్నత్వంలో ఏకత్వానికి మహా కుంభమేళా ఉదాహరణగా నిలుస్తుందని, ఇలాంటి ఘనమైన వేడుక ప్రపంచంలో మరెక్కడా కనిపించదని తెలిపారు.

    వివరాలు 

    అక్కినేని నాగేశ్వరరావు నటనాకౌశలంపై మోదీ ప్రశంసలు

    విద్వేషం, విభజనకు వ్యతిరేకంగా ప్రజలు సంకల్పం చేయాలని, గంగా ప్రవాహంలా సమాజంలో ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు.

    తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు ప్రతిభపై మోదీ ప్రశంసలు కురిపించారు.

    తెలుగు సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకువెళ్లారని కొనియాడారు. ఆయనతో పాటు రాజ్‌కపూర్, మహ్మద్‌ రఫీ, తపన్‌ సిన్హా వంటి ప్రముఖుల శతజయంతి వేడుకలు కూడా ఈ ఏడాదే జరగడాన్ని ప్రస్తావించారు.

    ''రాజ్‌కపూర్‌ తన సినిమాల ద్వారా భారతదేశం సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారు. మహ్మద్‌ రఫీ గాత్రం ప్రతి హృదయాన్నీ తాకుతుంది. ఆయన పాటలు ఇప్పటికీ ప్రస్తుత యువతను ఆకర్షిస్తున్నాయి'' అని మోదీ తెలిపారు. ఈ వారసత్వాలు భారత చలనచిత్ర పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

    వివరాలు 

    దిల్లీలో ప్రపంచ దృశ్య-శ్రవణ వినోద సదస్సు - వేవ్స్‌

    మొదటిసారిగా ''ప్రపంచ దృశ్య-శ్రవణ వినోద సదస్సు - వేవ్స్‌''ను ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు దిల్లీలో నిర్వహించనున్నట్టు మోదీ ప్రకటించారు.

    పరాగ్వే వంటి దేశాల్లో కూడా ఆయుర్వేదానికి లభిస్తున్న ఆదరణను ఆయన ప్రస్తావిస్తూ, భారత సాంప్రదాయ వైద్య విధానం ప్రపంచంలో ప్రత్యేకమైనదని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్ కీ బాత్
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మన్ కీ బాత్

    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం పూరీ జగన్నాథ దేవాలయం
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  తాజా వార్తలు
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు జార్ఖండ్
    UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ఉత్తర్‌ప్రదేశ్
    Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం ఇండియా
    G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం  బ్రెజిల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025