NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!
    మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!

    Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2025
    09:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ 17మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది.

    అదనంగా మరో 30 మంది ఇంజినీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యారేజి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై కూడా చర్యలు అవసరమని నివేదిక పేర్కొంది.

    కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పియర్లు కుంగిపోవడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది.

    తొలుత ప్రాథమిక నివేదికను సమర్పించిన అనంతరం, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపై కూడా సమగ్రంగా పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖకు చేరుకున్న నేపథ్యంలో, శుక్రవారం అధికారుల మధ్య తదుపరి కార్యాచరణపై చర్చలు జరిగాయి.

    Details

    క్రిమినల్ చర్యలకు సిఫార్సు 

    మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి సంబంధించి, 17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పష్టం చేసింది.

    వారిలో డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల్లో పనిచేసిన ఇంజినీర్లు ఉన్నారు.

    ముఖ్యంగా మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, మాజీ ఎస్‌ఈ రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు తదితరులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

    బ్యారేజి నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీలో లోపాలు, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం విఫలం కావడం, అలాగే డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్‌లోనూ చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు.

    మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు సమాచారం.

    Details

    శాఖాపరమైన చర్యలకు సిఫార్సు

    క్రిమినల్ చర్యలకు సంబంధించిన 17 మంది కాకుండా 30 మంది ఇంజినీర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫార్సు చేసింది. వీరిలో డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు.

    తాజా నివేదిక నేపథ్యంలో ఈ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించాలా లేదా అన్న దానిపై నీటిపారుదల శాఖ ఆలోచనలో పడింది. ఇటీవల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లకు పదోన్నతులపై డీపీసీ సమావేశం జరిగింది.

    తొమ్మిది మంది పేర్లు సిఫార్సు కాగా, అందులో గతంలో కాళేశ్వరం మొదటి లింక్‌లో ఎస్‌ఈగా పనిచేసి ప్రస్తుతం రామగుండం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నారు.

    ఎస్‌ఈల నుంచి సీఈలకు పదోన్నతుల కోసం గురువారం జరగాల్సిన డీపీసీ సమావేశం వాయిదా పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు  మిర్యాలగూడ
    Jagga Reddy: రాజకీయ నాయకుడి నుంచి నటుడిగా.. 'జగ్గారెడ్డి' ఫస్ట్ లుక్ విడుదల టాలీవుడ్
    TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి! ఇండియా
    Telangana: పౌరుల సమగ్ర డేటాబేస్ రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.. మీ నుంచి ఏ వివరాలు సేకరించనున్నారంటే ?  భారతదేశం

    ఇండియా

    Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు! ఉత్తర్‌ప్రదేశ్
    Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం? తెలంగాణ
    TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిల్లర కోసం ఇక బాధపడాల్సిన పనిలేదు! తెలంగాణ
    Nara Lokesh:  ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గీతం యూనివర్శిటీలో మెగా కెరీర్ ఫెయిర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025