LOADING...
Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్‌కు పద్మశ్రీ
గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్‌కు పద్మశ్రీ

Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్‌కు పద్మశ్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌కు చెందిన 'అజ్ఞాత హీరో' ఢోలక్ వాదకుడు మీర్ హాజీభాయ్ కాసంభాయ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. తన సంగీత ప్రతిభను కేవలం ఉపాధి కోసం కాకుండా సమాజ సేవకు అంకితం చేసిన ఈ కళాకారుడిని గుజరాత్ ప్రజలు ప్రేమగా 'హాజీ రామ్‌కడు' అని పిలుస్తుంటారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన దేశవ్యాప్తంగా వేలాది వేదికలపై తన కళను ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

వివరాలు

ఢోలక్ శబ్దమే ఆయనకు జీవిత మార్గం..

మీర్ హాజీభాయ్ కాసంభాయ్ 1932 ఆగస్టు 11న గుజరాత్‌లోని వడోదరాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతం, జానపద కళలపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, చుట్టూ ఉన్న వాతావరణం నుంచే సంగీతంలోని సూక్ష్మతలను నేర్చుకున్నారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వాద్యమైన ఢోలక్ శబ్దం ఆయనను బాగా ఆకట్టుకుంది. అదే ఆయన జీవిత మార్గంగా మారింది.

వివరాలు

భజనలు, కవ్వాలీలతో ఫేమస్..

భజనలు, కవ్వాలీలు, జానపద గీతాలు ఏవైనా హాజీభాయ్ ఢోలక్ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. కాలక్రమేణా ఆయన ప్రతిభ గుజరాత్ సాంస్కృతిక, జానపద సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన సరళ స్వభావం, వినూత్నమైన ఢోలక్ వాయిద్య శైలి కారణంగా అభిమానులు ప్రేమగా 'హాజీ రామ్‌కడు' అని పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం గుజరాత్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆయన అదే పేరుతో పరిచయం. ఢోలక్ అనేది సాధారణంగా సహాయక తాళ వాద్యంగా భావిస్తారు. అయితే హాజీభాయ్ దాన్ని ప్రధాన ఆకర్షణగా మార్చారు. భజన, గజల్, కవ్వాలి, గుజరాతీ జానపద సంగీతానికి తగ్గట్టుగా ఢోలక్‌ను కొత్తగా వినిపించేలా తీర్చిదిద్దారు. దీంతో ఢోలక్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

Advertisement

వివరాలు

ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శనలు..

తన ప్రత్యేక శైలితో కొత్త తరానికి ఢోలక్ వాయిద్యంలో కొత్త పద్ధతులను పరిచయం చేయడమే కాకుండా, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను అలరించారు. సంగీతంతో పాటు సమాజ సేవలో కూడా హాజీభాయ్ ముందుండేవారు. దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా మూడు వేలకుపైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో చాలా కార్యక్రమాలు గో సేవ, సామాజిక సేవ వంటి మంచి పనుల కోసం నిర్వహించబడినవే. ఆయన కళా ప్రయాణం గుజరాత్‌కే పరిమితం కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన కార్యక్రమాలు సహా పలు ప్రతిష్టాత్మక వేదికలపై కూడా ఆయన తన కళను ప్రదర్శించారు.

Advertisement

వివరాలు

కళాసాధనకు లభించిన గొప్ప గౌరవం పద్మశ్రీ..

కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ఇప్పటికే ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు గుజరాత్‌లోని అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల నుంచి సత్కారాలు లభించాయి. ఈ క్రమంలోనే 2026 జనవరి 25న జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది. ఇది ఆయన జీవితాంతం చేసిన కళాసాధనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.

వివరాలు

రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది మే 25న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను అందజేయనున్నారు. ఈసారి 'పీపుల్స్ పద్మ' భావనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రచారం, స్వార్థం లేకుండా దేశం, సమాజం, సంస్కృతికి జీవితాన్ని అంకితం చేసిన మారుమూల ప్రాంతాల అజ్ఞాత హీరోలను గుర్తించి గౌరవించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

Advertisement