Hyderabad Metro: మెట్రో ప్రయాణం మరింత సులభం.. త్వరలోనే నూతన మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వం హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టును సాంకేతికంగా విశ్లేషించేందుకు డీఎంఆర్సీని టెక్నికల్ కన్సల్టెంట్గా నియమించింది. దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టుల అమలు, నిర్వహణలో అనుభవం ఉన్న DMRC ప్రాజెక్టు పనితీరు, భవిష్యత్ విస్తరణ, నిర్వహణ సామర్థ్యాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించింది. అంతే కాక, ఆర్థిక, న్యాయ అంశాల పరిశీలన కోసం ఐడీబీఐ బ్యాంకును ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్గా నియమించి, ఎల్ & టీ సంస్థకు సంబంధించిన బకాయిలు, ఒప్పంద నిబంధనలు, అప్పులు, ఆర్థిక బాధ్యతలు వంటి అంశాలపై పూర్తి విశ్లేషణ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ (HMRC) ఎల్ & టీ సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
Details
హైదరాబాద్ మెట్రో భవిష్యత్ దిశపై స్పష్టత
బకాయిల చెల్లింపులు, ఒప్పందాల పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ నిర్వహణ విధానాలపై స్పష్టత త్వరలో వచ్చే దశలో ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే టేకోవర్ ప్రక్రియ వేగవంతం అవ్వనుంది. ప్రభుత్వం మార్చి 31నకే స్వాధీన ప్రక్రియ పూర్తి చేయడం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నది. టేకోవర్ అనంతరం మెట్రో సేవల విస్తరణ, కొత్త కారిడార్ల ప్రణాళిక, చార్జీల విధానం, నిర్వహణలో మార్పులు వంటి అంశాలు చర్చకు రావడం ఆవశ్యకమని భావిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చే సందర్భంలో, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు వేగవంతంగా ముందుకు సాగుతాయని అధికారులు పేర్కొన్నారు. కేబినెట్ తుది నిర్ణయం తర్వాత, హైదరాబాద్ మెట్రో భవిష్యత్ దిశపై స్పష్టత రాబోతుంది.