Page Loader
Reservations: లడఖ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హామీ 
లడఖ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు

Reservations: లడఖ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హామీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2024
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు, లడఖ్‌లోని రెండు ముఖ్యమైన సంస్థలు, లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, మంగళవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌తో సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి లడఖ్ ఎంపీ మహ్మద్ హనీఫా హాజరై, లడఖ్‌లో గెజిటెడ్ అధికారుల పోస్టుల్లో 95 శాతం స్థానికులకు కేటాయించాలని అంగీకరించినట్లు ప్రకటించారు. హనీఫా మాట్లాడుతూ, "ఈ వార్త లడఖ్ ప్రజలకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. వారు ఆశించినట్లుగా ఈ నిర్ణయం తీసుకోబడింది," అని పేర్కొన్నారు.

వివరాలు 

వచ్చే ఏడాది తదుపరి సమావేశం

వచ్చే నెలలో మరో సమావేశం వచ్చే ఏడాది జనవరి 15న జరిగే తదుపరి సమావేశంలో ఈ నిర్ణయాలు అమలుపరచడం, ఇతర డిమాండ్లపై చర్చించనున్నారు. ఇటీవల లడఖ్ నుండి ఢిల్లీకి వెళ్లి నిరసనలు తెలిపిన వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో, లడఖ్ ప్రజల డిమాండ్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని హామీ ఇచ్చింది. ఈ సమావేశం అనంతరం, లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి, కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించాయి.

వివరాలు 

లడఖ్ కీలక డిమాండ్లు 

లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్‌లో చేర్పు, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వంటి డిమాండ్లపై లడఖ్‌ వాసులు దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. అలాగే, లడఖ్ లో 2 లోక్‌సభ స్థానాలను ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు, ప్రస్తుతానికి లడఖ్ లో ఒక్కలోక్‌సభ స్థానం మాత్రమే ఉంది. కేంద్రం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, వీటి పై చర్చలకు మార్గం చూపింది. కొత్త జిల్లాల ఏర్పాటు 2019 ఆగస్టులో లడఖ్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించబడింది. ఆ తర్వాత, కేంద్రం లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తానని ప్రకటించింది.