Page Loader
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు హతం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు హతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2025
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతంలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. నారాయణ్‌పూర్‌-దంతెవాడ జిల్లాల సరిహద్దులోని దండకారణ్య అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అబుజ్‌మాద్‌ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Details

వీరమరణం పొందిన కానిస్టేబుల్

భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా, ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్‌ కానిస్టేబుల్‌ కరమ్‌ మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వారు ప్రకటించారు.