NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు 
    తదుపరి వార్తా కథనం
    Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు 
    Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024

    Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2024
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత నౌకాదళ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్టణం,గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం.ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

    సోమవారం నుండి ఈ నెల 27 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమంలో 50 కంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి.

    ఇది నావికాదళ డొమైన్‌లో అత్యంత ప్రముఖమైన అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా నిలిచింది.

    గతంలో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్-2022 ఎక్సర్‌సైజ్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం సముద్ర సహకారానికి,స్నేహానికి కేంద్రంగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటూనే ఉంది.

    రాబోయే మిలన్-2024 విన్యాసాలు,'కామ్రేడరీ - కోహెషన్ - కొలాబరేషన్' అనే థీమ్‌తో నిర్వహించబడుతున్నాయి. ఇందులో పాల్గొనే దేశాల మధ్య స్నేహం,ఐక్యత,సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

    Details 

    తరలిరానున్న ప్రముఖులు 

    మిలన్-2024 ఈవెంట్‌లో హైలైట్ ఈ నెల 22న RK బీచ్‌లో జరగనున్న మొత్తం ఉత్సవాల్లో కీలకమైనది సిటీ పెరేడ్.

    ఫిబ్రవరి 21, 22 తేదీల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు విశాఖ నగరానికి వస్తున్నారు.

    1955 నుండి 'మిలన్' బ్యానర్ క్రింద నిర్వహించబడుతున్న మిలన్ విన్యాసాలు, నౌకాదళ పరాక్రమం, సామర్థ్యాలను ప్రదర్శిస్తూ విభిన్న దేశాల మధ్య స్నేహం,స్నేహ సంబంధాలను పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి.

    సముద్ర భద్రతలో పరస్పర అవగాహన, సహకారాన్ని ప్రోత్సహించడానికి ద్వైవార్షిక కార్యక్రమంలో చేరిన దేశాలు పెరుగుతున్నాయి.

    Details 

    ఈవెంట్ సందర్భం ట్రాఫిక్ ఆంక్షలు 

    ఈ ఈవెంట్ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసు శాఖ ప్రకటించింది.

    కొన్ని రూట్లో భారీ వాహనాలను అనుమతి ఉండదని స్పష్టం చేసింది.

    ఫిబ్రవరి 20, 22తేదీల్లో ఆర్కే బీచ్ రోడ్డు నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాలను రాకపోవాలని నిషేధించారు.

    పాసులు కలిగిన వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

    బీచ్‌ రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పెరేడ్‌కి లక్ష మందికిపైగా ప్రజలు రావచ్చని నేవీ అధికారులు అంచనా వేశారు.

    ఎన్‌క్లోజర్లు,ఎల్‌ఈడీ స్క్రీన్లను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు.వీవీఐపీ,వీఐపీ రాక నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    విశాఖపట్టణం

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు ఏలూరు
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక అత్యాచారం
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వైజాగ్
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025