ఉగ్రదాడిలో మరణించిన కల్నల్కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్ప్రీత్ సింగ్ ఒకరు. మన్ప్రీత్ మృతదేహాన్ని శుక్రవారం మొహాలి జిల్లా ముల్లన్పూర్కు తీసుకురాగా అతని ఆరేళ్ల కుమారుడు గౌరవ వందనం సమర్పించడం అందరినీ దృష్టిని ఆకర్షిచింది. కుమారుడితో పాటు అతని రెండేళ్ళ చెల్లెలు పక్కన నిలబడి తండ్రి మృతదేహానికి సెల్యూట్ చేశారు. తన తండ్రికి ఏమైందనే విషయం చెప్పకుండా, మభ్యపెట్టి వారితో మృతదేహానికి సెల్యూట్ చేయించారు. మన్ప్రీత్ సింగ్ను చివరిసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ క్రమంలో ఆ చిన్నారులు చేసిన సెల్యూట్ను చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కాయి. ఈ సందర్భంగా కల్నల్ భార్య, సోదరి, తల్లి విలపించిన తీరు చూసి అక్కడున్న వారికి కన్నీళ్లు ఆగలేదు.