NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nara Lokesh: నేడు హస్తిన పర్యటనకు మంత్రి నారా లోకేష్..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nara Lokesh: నేడు హస్తిన పర్యటనకు మంత్రి నారా లోకేష్..
    నేడు హస్తిన పర్యటనకు మంత్రి నారా లోకేష్..

    Nara Lokesh: నేడు హస్తిన పర్యటనకు మంత్రి నారా లోకేష్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, లోకేశ్ ఈ రోజు రాత్రి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం కానున్నారు.

    రీసెంట్‌గా రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది.

    అలాగే, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చలు జరపడానికి అవకాశం ఉండవచ్చును.

    మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాలను వివరించనున్నారు.

    విశాఖను ఐటీ హబ్‌గా, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహకాలను అందించి సహకరించాలని కోరనున్నారు.

    వివరాలు 

    విశాఖలో ఏఐ విశ్వవిద్యాలయం

    ఏపీ ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)కు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, విశాఖలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి అంశాలపై కేంద్ర మంత్రితో లోకేశ్‌ చర్చలు జరిపే అవకాశం ఉంది.

    కృత్రిమ మేధపై శిక్షణను మెరుగుపరచడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆర్టిఫిషియల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (COEs) కేంద్రాలను ప్రారంభించనుంది.

    ఈ పర్యవేక్షణలో కేంద్రం నుంచి సహకారం అందించమని వారు కోరనున్నారు.

    వివరాలు 

    ఏపీకి రూ. 9,417 కోట్లు

    ఇక, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రైల్వే పనుల గురించి వివరించారు.

    ఈ సందర్భంగా, ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా చర్చించారు. ఏపీలో ఇప్పటికే రూ. 9,417 కోట్లు విలువైన రైల్వే పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

    అందువల్ల బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావన చేయలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ. 9,417 కోట్లు కేటాయించామని, దీనితో పాటు, యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించారని తెలిపారు.

    ఇక, ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చి, ఆధునిక సౌకర్యాలతో సృష్టించనున్నారు అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్

    తాజా

    IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ ఐఎండీ
    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్

    నారా లోకేశ్

    లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుని అనారోగ్యంతో చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణ చంద్రబాబు నాయుడు
    Nara Lokesh : వైసీపీ శ్రేణులపై నారా లోకేష్ సీరియస్.. ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తున్నారని మండిపాటు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    #Nara Lokesh: నవంబర్ 24 నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం  పాదయాత్ర
    #YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం  పాదయాత్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025