
Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపిక : పొంగులేటి
ఈ వార్తాకథనం ఏంటి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటివరకు మొత్తం 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
మిగిలిన లబ్ధిదారుల జాబితా వచ్చే నెల 10వ తారీఖు నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
పైలట్ ప్రాజెక్ట్లో మొత్తం 42 వేల ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
అందులో 24 వేల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, దాదాపు 100 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా వారు,లబ్ధిదారుల జాబితాలో 40 శాతం పేర్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సూచించాలనగా, మిగిలిన 60 శాతం ఎంపికను ఇందిరమ్మ కమిటీలు నిర్వహించనున్నాయని వివరించారు.
వివరాలు
16 స్లమ్ ప్రాంతాల్లో నాలుగు అంతస్తుల భవనాలు
అయితే, మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఎటువంటి జాబితా ఇవ్వకుండా, ఎంపిక బాధ్యతను అధికారులకే అప్పగించారని విమర్శించారు.
ఇతర ప్రాంతాల అభివృద్ధిపై మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న చెంచు గిరిజనులకు 9,200 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
అంతేకాక, హైదరాబాద్ నగరంలోని 16 స్లమ్ ప్రాంతాల్లో నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి తరహా నిర్మాణాలను వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో కూడా చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.