NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు

    Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీకి సమయం దగ్గర పడుతోంది.ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న 40 మంది అందాల భామలు, ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు.

    ఇప్పటి వరకు జరిగిన స్పెషల్ ఛాలెంజ్‌ల ద్వారా 14 మంది పోటీదారులు క్వార్టర్స్‌కి నేరుగా ఎంపికయ్యారు.

    వీరిలో స్పోర్ట్స్ ఛాలెంజ్‌ నుంచి ఒకరు,టాలెంట్ ఛాలెంజ్‌లో ఒకరు,హెడ్ టు హెడ్ రౌండ్‌లో నలుగురు,టాప్ మోడల్ విభాగంలో నలుగురు,బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగం నుంచి మరో నలుగురు విజేతలుగా నిలిచారు.

    మిగిలిన 26 మంది ఎంపిక ప్రక్రియ వివిధ ఖండాల ప్రాతినిధ్యం మేరకు జరగనుంది.

    అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాలకు చెందిన పోటీదారులను న్యాయనిర్ణేతలు ఎంపిక చేయనున్నారు.

    వివరాలు 

    ప్రతి ఖండం నుంచి 10 మంది

    ఇప్పటి వరకు ఇండోనేషియా మరియు వేల్స్‌కి చెందిన భామలు రెండు విభాగాల్లో విజేతలుగా నిలవడం విశేషం.

    తద్వారా ఇప్పటివరకు టాప్ 40లో 12 మంది మాత్రమే ఖరారయ్యారు. ఇంకా 28 మంది ఎంపికకు బాకీ ఉంది.

    ఈ టాప్ 40లో ఖచ్చితంగా ప్రతి ఖండం నుంచి 10 మందిని కలిపేలా ఎంపిక చేస్తారు.

    ఆ తర్వాతి దశగా వీరిలోంచి టాప్ 20 మంది సెలెక్ట్ అవుతారు,ఈ దశలో ఒక్కో ఖండం నుంచి 5 మందికి అవకాశముంటుంది.

    టాప్ 8 దశకు వచ్చే సమయానికి ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు.

    చివరగా ఒక్కో ఖండాన్ని ప్రాతినిధ్యం వహించేలా నలుగురు పోటీదారులు ఫైనల్ రౌండ్‌కి అర్హులవుతారు.

    వివరాలు 

    హైటెక్స్‌ వేదికగా ఫైనల్ వేడుకలు - భారీ భద్రతా ఏర్పాట్లు 

    వీరిలో ఒకరు విజేతగా నిలవగా, మిగిలిన ముగ్గురు వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నరప్‌గా ఎంపికవుతారు.

    ఫైనల్ పోటీలు మే 31న హైదరాబాద్ హైటెక్స్‌లో నూతనంగా నిర్మించిన నాలుగో హాల్‌లో నిర్వహించనున్నారు.

    ఈ సందర్భంగా సైబర్ పోలీసు విభాగం, ట్రాఫిక్ శాఖ, పర్యాటక శాఖ, ఈవెంట్ నిర్వాహకులు కలిసి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

    హాల్ సామర్థ్యం దాదాపు 3,500 మంది ఉండటంతో, అంతమంది అతిథులు పాల్గొంటారని అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.ఫైనల్ ఈవెంట్ వేడుకలు సాయంత్రం నుంచే ప్రారంభమవుతాయి. ముఖ్యంగా తుది పోటీలు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Miss world 2025: మిస్‌ వరల్డ్‌ 2025 ఫైనల్‌ పోటీలకు కౌంట్‌డౌన్‌.. 31న జరిగే కార్యక్రమానికి హైటెక్స్‌లో ఏర్పాట్లు తెలంగాణ
    Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు  విశాఖపట్టణం
    US Visa: విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అమెరికా  అమెరికా
    LSG vs RCB: లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..క్వాలిఫయర్‌-1కు ఆర్సీబీ  ఐపీఎల్

    తెలంగాణ

    Telangana: రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం భారతదేశం
    TGSRTC Strike: తెలంగాణలో బస్సులు బంద్‌.. అర్థరాత్రి నుంచి RTC సమ్మె ప్రారంభం! భారతదేశం
    TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ భారతదేశం
    Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025