NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్‌.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్‌.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే
    PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్‌.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే

    PM Modi: రాజ్యసభ వేదికగా 'మోదీ 3.0'కు రోడ్ మ్యాప్‌.. ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవే

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2024
    06:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    PM Modi Rajya Sabha speech: రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

    ఈ సందర్భంగా మోదీ ఒక వైపు విపక్షాలను తూర్పారబడుతూనే.. మరోవైవు 'మోదీ-3.0' సర్కారు ఆకాంక్షలను వెలిబుచ్చారు.

    తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చే సయయం ఎంతో దూరంలో లేదన్నారు.

    మోదీ-3.0 ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిని బలోపేతం చేయడానికి తన శక్తినంతా ఉపయోగిస్తుందని స్పష్టం చేశారు.

    రాబోయే 5సంవత్సరాలలో దేశంలో చికిత్స చాలా చౌకగా మారుతుందన్నారు. పేదలకు పీఎం హౌసింగ్ అందించేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

    సోలార్ పవర్ వల్ల వచ్చే ఐదేళ్లలో విద్యుత్ బిల్లు సున్నాగా మారుందన్నారు. దేశవ్యాప్తంగా పైప్డ్ గ్యాస్ కనెక్షన్ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తామన్నారు.

    మోదీ

    దేశాన్ని ఉత్తరం, దక్షిణాదిగా విభజిస్తున్న కాంగ్రెస్

    ప్రతిపక్షాలపై కూడా మోదీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కాంగ్రెస్, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిందన్నారు.

    దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పరువును కటకటాల వెనక్కి నెట్టి, వార్తాపత్రికలను నియంత్రించింది ఎవరు అని ప్రశ్నించారు.

    ఇప్పుడు ఉత్తర, దక్షిణాదిని విచ్ఛిన్నం చేసే ప్రకటనలను కాంగ్రెస్ చేస్తోందన్నారు.

    10 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ జాబితాలో 11వ స్థానానికి తీసుకొచ్చిందని మోదీ అన్నారు.

    కానీ పదేళ్లలో దేశాన్ని బీజేపీ ప్రభుత్వం 5వ స్థానానికి తీసుకొచ్చామన్నారు. అలాంటి కాంగ్రెస్ ఆర్థిక విధానాలపై తమకు పాఠాలు చెబుతోందన్నారు. సాధారణ కేటగిరీలోని పేదలకు ఏనాడూ రిజర్వేషన్లు ఇవ్వలేదని ప్రధాని అన్నారు.

    మోదీ

    దేశంలో బానిస మనస్తత్వాన్ని ప్రోత్సహించింది ఎవరు?: మోదీ

    ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై పదునైన విమర్శలను గుప్పించారు. బ్రిటీష్ వారి ప్రభావం ఎవరిపై ఉన్నదని ప్రశ్నించారు.

    కాంగ్రెస్‌ను ఎవరు పుట్టించారని తాను అడగడం లేదని, కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశంలో బానిస మనస్తత్వాన్ని ప్రోత్సహించింది ఎవరు? అని అడిగారు.

    మీరు బ్రిటీష్ వారిచే ప్రభావితం కాకపోతే బ్రిటిష్ వారు చేసిన శిక్షాస్మృతిని ఎందుకు మార్చలేదన్నారు.

    బ్రిటిష్ కాలం నాటి వందలాది చట్టాలు ఎందుకు కొనసాగాయి? మీరు రెడ్ లైట్ సంస్కృతిని ఎందుకు కొనసాగించారు? అని ప్రశ్నించారు.

    బ్రిటీష్ పార్లమెంటు సమయానికి అనుగుణంగా భారతదేశంలో బడ్జెట్ సంప్రదాయం సంవత్సరాలు ఎందుకు కొనసాగయని అడిగారు.

    మన సైన్యాల చిహ్నాలలో బానిసత్వ చిహ్నాలు ఎందుకు ఉన్నాయన్నారు. అందుకే వాటిని తాము ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామన్నారు.

    మోదీ

    కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని ప్రార్థిస్తున్న: మోదీ

    ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా మోదీ తనదైన శైలిలో చురకలు అంటించారు.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల కాంగ్రెస్‌కు 40లో‌క్‌సభ సీట్లు రావని ప్రకటించారు. అయితే ఈ ప్రకనటను ఉటంకిస్తూ.. కాంగ్రెస్‌కు మోదీ చురకలు అంటించారు.

    రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40సీట్లు అయినా కాపాడుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు మోదీ చెప్పారు.

    ప్రభుత్వ కంపెనీలకు సంబంధించి తమపై ఆరోపణలు చేస్తున్నారన్ని మోదీ అన్నారు. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదన్నారు.

    BSNL, MTNLని ఎవరు నాశనం చేశారని ప్రశ్నించారు. HAL ఏ స్థితిలో ఉంచబడిందో గుర్తుంచుకోవాలన్నారు.

    ఎయిర్ ఇండియాను నాశనం చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. తాము బానిత్వాన్ని మోయడం లేదని కాంగ్రెస్ విరుచుకపడ్డారు.

    మోదీ

    యువరాజు (రాహుల్ గాంధీ) లాంచ్ కావట్లేదు.. మోదీ సెటైర్లు

    రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'కాంగ్రెస్ యువరాజు( రాహుల్ గాంధీ)ని స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసినట్లు మోదీ పేర్కొన్నారు.

    కానీ రాహుల్ నాన్ స్టార్టప్ అని తేలిందని మోదీ ఎగతాళి చేశారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన రాహుల్‌ని లాంచ్ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు.

    ఇటీవల రాజ్యసభలో ఖర్గే చేసిన ప్రసంగాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తమకు 400సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే పేర్కన్నట్లు గుర్తు చేసారు.

    కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుందన్నారు. అంతేకాకుండా, ఖర్గే ఈరోజు సుదీర్ఘ ప్రసంగం చేశారని, ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా వచ్చిందని తాను ఆశ్చర్యపోయానన్నారు.

    వారి స్పెషల్‌ కమాండర్లు సభకు రాకపోవడం వల్లే ఆయన సభలో స్వచ్ఛగా మాట్లాడి ఉంటారని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    రాజ్యసభ
    తాజా వార్తలు
    కాంగ్రెస్

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    నరేంద్ర మోదీ

    PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం భారతదేశం
    PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి  భారతదేశం
    Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ  బిహార్
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  మాల్దీవులు

    రాజ్యసభ

    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు ఎంపీ
    జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ప్రహ్లాద్ జోషి

    తాజా వార్తలు

    Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్
    Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Hage Geingob: క్యాన్సర్‌తో నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ కన్నుమూత  నమీబియా
    Chile Wildfires: చిలీ అడవుల్లో కాల్చిచ్చు.. 46 మంది మృతి చిలీ

    కాంగ్రెస్

    Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు  తన్నీరు హరీష్ రావు
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  ఛత్తీస్‌గఢ్‌
    PAC Meeting: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ చేయాలి.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం తెలంగాణ
    Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025