Page Loader
Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!
45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!

Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని ఇచ్చాయి. ఇక బీజేపీ కూడా మిషన్ 50లో నిమగ్నమైంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగే భారీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. దాదాపు 42 ఏళ్లలో దోడా ప్రాంతానికి ప్రధాని రావడం ఇదే తొలిసారి. 1982లో చివరి సారిగా నరేంద్ర మోదీ ఇక్కడి పర్యటించారు. దోడా, కిష్త్వార్‌ ప్రాంతాల్లో ర్యాలీ సందర్భంగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Details

హర్యానాలో ర్యాలీలో ప్రసంగించనున్న మోదీ

జమ్ముకశ్మీర్‌ పర్యటన తరువాత, ప్రధాని మోదీ హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించే మరో ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఇక హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జమ్ము డివిజన్‌లోని మొత్తం 43 స్థానాలకు పోటీ చేస్తోంది. ఈ ఎన్నికలు మూడు దశల్లో సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.